KA PAUL: తెలంగాణలో రైతులకు సాయం ఏదీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రశాంత్ కిషోర్ ద్వారా కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ని కేసీఆర్ కలిశారు. తెలంగాణ అప్పు ఐదు లక్షల కోట్లు, ఇంకా రోజురోజుకి అప్పులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లోని వివిధ కార్మికుల యూనియన్స్ నాతో సమావేశమయ్యాయి. మేం ఢిల్లీ వెళ్లి వచ్చాక.. సీబీఐ విచారణ ప్రారంభం అయింది. డబ్బులు దాచుకోడానికి సీఎం, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు.
తెలంగాణలోని రైతులకు సహాయం ఎందుకు చేయరు.? ప్రశాంత్ కిషర్ తో కలిసి అన్ని పార్టీలను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు.రేపు 34మంది సివిల్ సర్వీస్ అధికారులు నన్ను కలుస్తున్నారు. చిన్న చిన్న పార్టీలన్నీ మాతో కలుస్తున్నాయి. పార్థసారథి రెడ్డి 550కోట్లతో ఈడీకి చిక్కాడు. పదివేల కోట్లు ఇస్తామని.. బిజెపి రాజ్యసభ సీట్ కోసం ప్రయత్నించారు. కాంగ్రెస్ లోని ఒకటి రెండు లీడర్స్ కి నెలకు కోటి రూపాయలు ఇచ్చి కేసీఆర్ మాట్లాడకుండా చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
వీరు సభకు వెళ్లినా కూడా సస్పెండ్ అయ్యేలా చేస్తాం. 1200 మంది అమరవీరుల్లో ఎవరు అర్హులు దొరకలేదా.? పార్థసారధి రెడ్డి స్టాలిన్, మమతా బెనర్జీని కూడా రాజ్యసభ సీట్ అడిగాడు. 10వేల కోట్లు ఇచ్చి ప్రశాంత్ కిషోర్ ని పంపించాడు. రాకేష్ టికాయత్ ని రైతు సంఘాల నుంచే తొలగించారు. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ పర్యటనలు. తెలంగాణలోని రైతులకు, అమరవీరుల కుటుంబాలకు డబ్బు సహాయం చేయండి.. నిరుద్యోగులను కాపాడండి అని కేఏ పాల్ కోరారు.
బీజేసీ ఇస్తానని చెప్పిన రోడ్ మ్యాప్ ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పుట్టిన ఊర్లోనే ఓట్లు రాలేదు.. ఇక్కడేం చేస్తాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ని నాతో కలవమని చెప్పాను, వినలేదన్నారు. పవన్ కళ్యాణ్ కి నూటికి ఒక్క ఓటు లేదు..శ్రీకాంత చారి తల్లి శంకరమ్మతో మూడు సార్లు మాట్లాడాను. నన్ను కలవడానికి వస్తానంటే, పోలీసులు ఆపుతున్నారు. 1200 మంది అమరవీరుల కుటుంబాలతో నేను టచ్ లో ఉన్నాను. కేసీఆర్ కి కాస్త చిత్తశుద్ధి ఉన్న శంకరమ్మకు రాజ్యసభ సీట్ ఇవ్వు. గతంలో శంకరమ్మకు ఓడిపోయే సీట్ ఇచ్చారు. నీ కూతురికి గెలిచే ఎమ్యెల్సీ సీట్ ఇచ్చావు. నీ కుటుంబంలో ఏ ఒక్కరైనా తెలంగాణ కోసం చనిపోయారా.? అని ప్రశ్నించారు కేఏ పాల్.
LIVE: రైతులు, అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ చెక్కుల పంపిణీ
- Tags
- ap
- cm kcr
- Farmers
- kcr
- pawan kalyan
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!