K Laxman: బీజేపీ అధికారంలోకి వస్తే.. నిజమైన చరిత్రకారుల్ని వెలుగులోకి తెస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Laxman Interesting Comments On Sardar Papanna Goud: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. నిజమైన చరిత్రకారుల్ని వెలుగులోకి తీసుకొస్తామని రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. సబ్బండ వర్గాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తి అని అన్నారు. పాపన్న పోరాట స్ఫూర్తితో ఆయన ఆశయం కోసం సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బహుజనుల ఆత్మగౌరవ పోరాటానికి ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు. దొరలు, జమీన్దారులు, మొగలాయిలను ఓడించిన ధీరుడు పాపన్న అని కొనియాడారు. వృత్తిని అవహేళన చేసిన, అగౌరవంగా వ్యవహరించిన వారిపై తిరుగుబాటు చేశారన్నారు.
Kishan Reddy: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగొట్టింది.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
బహుజన ఆత్మీయులతో చిన్నపాటి సైన్యంతో దోపిడీ పాలన అంతం చేసిన గొప్ప చరిత్రకారుడు పాపన్న అని లక్ష్మణ్ ప్రశంసించారు. మొగలాయి సైన్యంను ఓడించి.. భువనగిరి, ఓరుగల్లు, గోల్కొండ స్వాధీనం చేసుకున్న వీరుడు పాపన్న అని చెప్పారు. కుతుబ్ షాహీ, మొఘల్, నిజాం వలస పాలనను ఓడించిన వీరుడని.. అలాంటి చరిత్రను పిల్లలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం, బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ బహుజన బిడ్డల చరిత్ర కనుమరుగు చేశారన్నారు. నేతాజీ, భగత్ సింగ్ లాంటి వాళ్ల చరిత్ర కూడా చెరిపేశారన్నారు. బిర్సా ముండా, అల్లూరి లాంటి జాతీయ హీరోలను మోడీ ప్రజలకు గుర్తు చేస్తున్నారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళ త్యాగాలకు గుర్తింపు లేకుండా.. ఆ నలుగురికీ మాత్రమే గుర్తింపు ఇచ్చారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ఆ నలుగురికి పరిమితమైన చరిత్రను.. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ హీరోలను బయటికి తేవాలని కోరారు.
బీజేపీ అధికారంలోకి వస్తే.. తాము చరిత్ర కారులను వెలుగులోకి తీసుకొస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. ఢిల్లీ వేదికగా మోగులయ్య గౌడ్ను గుర్తు చేసుకున్నామన్నారు. కుల వృతుల వారికి సాయంగా ప్రధాని మోడీ విశ్వకర్మ యోజన చేశారన్నారు. శిక్షణ, ఉచిత పరికరాలతో పాటు వారికి లోన్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారన్నారు. 13వేల కోట్ల రూపాయలతో 30 లక్షల కుటుంబాలకు మోడీ ఊతమిస్తున్నారని వెల్లడించారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!