BJP Laxman: కేసీఆర్ ఫైటర్ కాదు చీటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో యూపీ తరహా పాలన రావాలని.. కేసీఆర్ ఫైటర్ కాదు చీటర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత కే. లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా వస్తున్న ఫలితాలు, జాతీయ కార్యవర్గ సమావేశం, విజయ సంకల్ప సభకు భారీగా జనాలు రావడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్ పీఠాలు కదులుతున్నాయని.. మోదీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదని ఆయన అన్నారు. మోదీ పద్మ అవార్డులు, రాజ్యసభ స్థానాలు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ద్వారా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు.
అట్టడుగు వర్గాల వ్యక్తిని ముఖ్యమంత్రి చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. 18 శాతం ఉన్న దళితులకు ఒక మంత్రి అని.. 10 శాతం ఉన్న గిరిజనులకు ఒక మంత్రి పదవని.. ఒక శాతం ఉన్న కులానికి, మీ కుటుంబంలో ఉన్న వారికి 4 మంది మంత్రి పదువులు ఇచ్చారని విమర్శించారు. అందుకే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఈశాన్య భారతంలో క్రైస్తవులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వారే ముఖ్యమంత్రులు, స్పీకర్లుగా కొనసాగుతున్నారని.. ఇదే మోదీ సామాజిక న్యాయసూత్రం అని అన్నారు.
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
Read Also: Supreme Court: విజయ్ మాల్యాకు బిగ్ షాక్.. కోర్టు ధిక్కార కేసులో నాలుగు నెలల జైలుశిక్ష
తెలంగాణలో యూపీ తరహా పాలన రావాలని కోరుకుంటున్నానని లక్ష్మణ్ అన్నారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. యూపీలో సంక్షేమ పాలన సాగుతోందని ఆయన అన్నారు. ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలు పెంచారని.. మద్యం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాడని.. డిస్కంలకు బకాయిలు చెల్లించకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల నుంచి రేషన్ కార్డులు లేవని.. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ
బీజేపీ విజయ సంకల్ప సభ షాక్ నుంచి తేరుకోవడానికి కేసీఆర్కు వారం పట్టిందని.. పుత్ర వాత్సల్యంతో ఆర్జేడీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు ఎలా పతనం అయ్యాయో.. అడ్రస్ లేకుండా పోయాయో.. రేపు టీఆర్ఎస్కు కూడా అదే గతి పడుతుందని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ను ఎప్పుడు గద్దె దించాలా అని చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీ రద్దు చేడమని.. ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముషీరాబాద్ లో నీ బొమ్మ పెట్టుకుని ప్రచారం చేస్తే ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేదని గుర్తు చేశారు.
- Tags
- bjp
- cm kcr
- K Laxman
- TRS
- TRS vs BJP
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!