Jurala Project : ఎండిన జూరాల.. నీళ్లు లేక విలవిల.. పాలమూరు ఆయకట్టుకు తప్పని జలకష్టం.!
- డెడ్ స్టోరేజీకి చేరిన జూరాల ప్రాజెక్టు
- కోయిల్ సాగర్ ఆయకట్టుకు నీటి కష్టాలు తీవ్రం
- నారాయణపూర్ నుంచి నీటి విడుదలకు ప్రభుత్వ ప్రయత్నాలు
- కర్ణాటకతో చర్చలు.. 5 టీఎంసీల కోసం విజ్ఞప్తి
Jurala Project :ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రాణాధారమైన జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో పాలమూరు రైతాంగం జలకష్టంతో విలవిలలాడుతోంది. ఎండలు ముదురుతున్న కొద్దీ ప్రాజెక్టులో నీటి మట్టం అట్టడుగుకు పడిపోవడంతో కోయిల్ సాగర్ లిఫ్ట్ మోటార్లకు నీరు అందడం లేదు. దీని ప్రభావం కోయిల్ సాగర్ చివరి ఆయకట్టుపై తీవ్రంగా పడుతోంది, సాగునీరు అందక చేతికి వచ్చిన పంటలు ఎండిపోయే స్థితికి చేరుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కోయిల్ సాగర్ ఆయకట్టును ఆదుకోవడానికి తక్షణమే నీటిని విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్ (జి. మధుసూదన్ రెడ్డి) ప్రభుత్వాన్ని , సంబంధిత మంత్రిని కోరారు.
Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ ట్రెండ్
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
మరోవైపు, రాష్ట్రంలో నెలకొన్న ఈ సాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో ఫోన్ లో మాట్లాడి, జూరాలకు కనీసం 5 టీఎంసీల నీటిని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేవలం ఫోన్ సంప్రదింపులకే పరిమితం కాకుండా, ఈ సమస్య పరిష్కారం కోసం పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు , ఎమ్మెల్యేల బృందం మరో వారం రోజుల్లో బెంగళూరు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను నేరుగా కలవాలని నిర్ణయించుకుంది. కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నీటిని విడుదల చేస్తేనే పాలమూరు గడ్డపై ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోసే అవకాశం ఉంటుంది.
YS Jagan : అమరావతి తీర్మానం ఒక పెద్ద డ్రామా.. బాబు దృష్టి అంతా దోపిడీ పైనే
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?