Jurala Project : ఎండిన జూరాల.. నీళ్లు లేక విలవిల.. పాలమూరు ఆయకట్టుకు తప్పని జలకష్టం.!
- డెడ్ స్టోరేజీకి చేరిన జూరాల ప్రాజెక్టు
- కోయిల్ సాగర్ ఆయకట్టుకు నీటి కష్టాలు తీవ్రం
- నారాయణపూర్ నుంచి నీటి విడుదలకు ప్రభుత్వ ప్రయత్నాలు
- కర్ణాటకతో చర్చలు.. 5 టీఎంసీల కోసం విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jurala Project :ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రాణాధారమైన జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో పాలమూరు రైతాంగం జలకష్టంతో విలవిలలాడుతోంది. ఎండలు ముదురుతున్న కొద్దీ ప్రాజెక్టులో నీటి మట్టం అట్టడుగుకు పడిపోవడంతో కోయిల్ సాగర్ లిఫ్ట్ మోటార్లకు నీరు అందడం లేదు. దీని ప్రభావం కోయిల్ సాగర్ చివరి ఆయకట్టుపై తీవ్రంగా పడుతోంది, సాగునీరు అందక చేతికి వచ్చిన పంటలు ఎండిపోయే స్థితికి చేరుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కోయిల్ సాగర్ ఆయకట్టును ఆదుకోవడానికి తక్షణమే నీటిని విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్ (జి. మధుసూదన్ రెడ్డి) ప్రభుత్వాన్ని , సంబంధిత మంత్రిని కోరారు.
Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ ట్రెండ్
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
- CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
మరోవైపు, రాష్ట్రంలో నెలకొన్న ఈ సాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో ఫోన్ లో మాట్లాడి, జూరాలకు కనీసం 5 టీఎంసీల నీటిని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేవలం ఫోన్ సంప్రదింపులకే పరిమితం కాకుండా, ఈ సమస్య పరిష్కారం కోసం పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు , ఎమ్మెల్యేల బృందం మరో వారం రోజుల్లో బెంగళూరు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను నేరుగా కలవాలని నిర్ణయించుకుంది. కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నీటిని విడుదల చేస్తేనే పాలమూరు గడ్డపై ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోసే అవకాశం ఉంటుంది.
YS Jagan : అమరావతి తీర్మానం ఒక పెద్ద డ్రామా.. బాబు దృష్టి అంతా దోపిడీ పైనే
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!