YS Jagan : అమరావతి తీర్మానం ఒక పెద్ద డ్రామా.. బాబు దృష్టి అంతా దోపిడీ పైనే
- అమరావతి తీర్మానంపై జగన్ తీవ్ర విమర్శలు
- చంద్రబాబు పాలనపై అవినీతి ఆరోపణలు
- రాజధాని వ్యయాలపై జగన్ కీలక ప్రశ్నలు
- అసెంబ్లీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి లేవని, ఆయన దృష్టిలో పరిపాలన అంటే కేవలం అవినీతి, దోపిడీ మాత్రమేనని జగన్ దుయ్యబట్టారు.
గత వారం శాసనసభలో అమరావతిపై ప్రవేశపెట్టిన తీర్మానం కేవలం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నమని జగన్ విమర్శించారు. అసలు రాజ్యాంగంలో రాష్ట్రానికి ‘రాజధాని’ అనే పదమే లేదని, కేవలం దేశానికి మాత్రమే రాజధాని ఉంటుందని స్వయంగా మంత్రి పార్థసారధి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టమని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు తమ రాజధానులను తామే నిర్ణయించుకున్నాయని తెలిపారు. అలాంటప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ తీర్మానాల పేరుతో ఎందుకు డ్రామాలు ఆడుతోందని జగన్ ప్రశ్నించారు.
Also Read
- CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- Nadendla Bhaskara Rao Passes Away: మాజీ సీఎం కన్నుమూత.. నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!
Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!
అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. గతంలో 50 వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాలకు లక్ష కోట్లు అవుతుందని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు అదనంగా మరో 50 వేల ఎకరాలు ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. చదరపు అడుగుకు రూ. 11 వేల నుండి రూ. 14 వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు. “ఏ స్కాములు లేకపోతే అంత ఖర్చు ఎందుకు అవుతుంది? అభివృద్ధికి అవసరమైన రెండు లక్షల కోట్లు ఎక్కడి నుండి వస్తాయి? ఈ ప్రాజెక్ట్ ఎన్నేళ్లకు పూర్తవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు.
ఐదున్నర గంటల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, కేవలం తనను , వైసీపీని దూషించడానికే సభను వాడుకున్నారని జగన్ మండిపడ్డారు. ఒకవైపు అసెంబ్లీని పిలిచిన ప్రభుత్వం, అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. కౌన్సిల్లో చంద్రబాబు అవినీతిని సభ్యులు కడిగిపారేస్తారనే భయంతోనే బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు.
భవిష్యత్తులో ఎవరూ రాజధానిని మార్చకుండా చట్టం తెస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తూ.. అసెంబ్లీలో చట్టసవరణలు చేసే అధికారం సభకు ఉంటుందన్న విషయం బాబుకు తెలియదా అని ప్రశ్నించారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్లో సానుభూతి పొందడానికే చంద్రబాబు ఇటువంటి విన్యాసాలు చేస్తున్నారని, ఆయన అసలు రంగు ప్రజలందరికీ తెలుసని జగన్ స్పష్టం చేశారు.
అమరావతి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ వ్యవహారంలో పారదర్శకత ఎక్కడ ఉందని ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Condom Prices: బెడ్రూమ్లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?