Jupally Krishna Rao : ప్రాజెక్టుల చర్చకు బీఆర్ఎస్ ఎందుకు పారిపోతోంది.?
- ప్రాజెక్టుల చర్చకు బీఆర్ఎస్ గైర్హాజరు
- పవర్పాయింట్ డ్రామా అంటూ జూపల్లి విమర్శ
- పాలమూరు ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ క్రెడిట్ గుర్తు
- అవినీతి బయటపడుతుందనే భయమే కారణమన్న ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ‘జల యుద్ధం’ పీక్ స్టేజ్కి చేరింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదలుకొని కృష్ణా జలాల కేటాయింపుల వరకు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో ఎవరు అబద్ధాలు చెబుతున్నారు? ఎవరు వాస్తవాలను దాస్తున్నారు? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
తాజాగా ఈ అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రమ్మంటే.. మైక్ ఇవ్వలేదనే చిన్న నెపంతో అసెంబ్లీని బహిష్కరించి పారిపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటి?” అని ఆయన నిలదీశారు. ప్రాజెక్టుల క్రెడిట్ విషయంలో కేసీఆర్ అండ్ టీమ్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన కొట్టిపారేశారు.
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రూ.351 పెంపు..
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
Sarfaraz Khan: దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదుగా.. పాపం సర్ఫరాజ్ ఖాన్!
తెలంగాణ ప్రాజెక్టులపై అసెంబ్లీ వేదికగా జరుగుతున్న చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాక రేపుతోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంతా ఒక డ్రామా అని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు ప్రజలను కేవలం ఓటు బ్యాంకులాగే వాడుకుందని, ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తి చేసుకున్నాయని.. కేవలం మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్ల సమయం పట్టిందని జూపల్లి ఎద్దేవా చేశారు. అన్నీ తామే చేశామని కేసీఆర్ ఫ్యామిలీ చెప్పుకోవడం ఆత్మవంచన అని ఆయన విమర్శించారు.
అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని బీఆర్ఎస్ బహిష్కరించడంపై జూపల్లి సూటి ప్రశ్నలు సంధించారు. కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు రమ్మని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినప్పుడు.. చర్చకు రాకుండా పారిపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. సభలోకి వచ్చి చర్చలో పాల్గొంటే.. గత పదేళ్లలో జరిగిన ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరిట జరిగిన అవినీతి, నీటి కేటాయింపుల్లో చేసిన పొరపాట్లు బట్టబయలవుతాయనే భయంతోనే కేసీఆర్ అండ్ బృందం సభకు రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
గతంలో మైక్ ఇవ్వని సందర్భాలు వందలాది ఉన్నాయని.. అంతమాత్రాన ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని బహిష్కరించడం అంటే ప్రజల గొంతును నొక్కడమేనని జూపల్లి స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్హౌస్లో కూర్చుని సభలు పెడతా అని చెప్పడం కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి వాస్తవాలు మాట్లాడాలని సవాల్ విసిరారు. మొత్తానికి ప్రాజెక్టుల విషయంలో అబద్ధాలు చెబుతున్నది ఎవరో ప్రజలకు తెలుసని, త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!