Jupalli Krishna Rao: కేటీఆర్ వల్ల పండుగరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది : జూపల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupalli Krishna Rao: పండుగ రోజున ప్రెస్ మీట్ పెట్టల్సిన పరిస్థితి మాజీ మంత్రి కేటీఆర్ కల్పించారని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. డిసెంబర్ లో కొల్లాపూర్ లో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి తన బంధువుల చేతిలో హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. వ్యక్తిగత కారణాల వలన, భూ తగాదాలతో హత్య జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు అయ్యాక ఇప్పుడు తెర మీదికి ఆ హత్యను ఎందుకు తీసుకు వచ్చారు? ప్రశ్నిచారు. హంతకులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కొందరు ఆల్రెడీ పోలీస్ ల అదుపులో ఉన్నారని అన్నారు. 1999 నుండి ఇప్పటి వరకు ఎన్నికల్లో నా మెజార్టీ పెరుగుతూ వస్తుందని, తన విలువలుతో కూడిన రాజకీయాలు చేస్తానని అన్నారు.
మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి బీజేపీ సానుభూతి పరుడని అన్నారు. కానీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారని తెలిపారు. ఎన్నికల కోసం కేటీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ సర్పంచ్… బీఆర్ఎస్ పార్టీ లో చేరడం లేదని కాంగ్రెస్ సర్పంచ్ ను హత్య చేశారని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో జెట్పీటీసీ హనుమంత్ నాయక్, సర్పంచ్ ల పై అక్రమ కేస్ లు, మర్డర్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేవారు. తన నియోజక వర్గంలో బీఆర్ఎస్ పాలనలో చాలా మందిని హత్యలు చేశారని గుర్తుచేశారు. చేయని వాటికి చేశానని తనపై బురద చల్లుతున్నారు… నా ప్రతిష్టకు భంగం కలిగించే లాగా మాట్లాడుతున్నారని.. రాజకీయాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..
- Telangana School Bandh: తెలంగాణలో నేడు పాఠశాలల బంద్.. ఎందుకంటే..?
- Telangana Weather: నైరుతి రుతుపవనాల్లో కదలిక.. దంచికొడుతున్న వర్షాలు.. ఈ మూడు రోజులు జాగ్రత్త!
- Tragedy: నల్గొండలో దారుణం.. ఒకే ఇంట్లో కుళ్ళిన స్థితిలో నాలుగు మృతదేహాలు..
Read also: Jogi Ramesh: నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి నాకు పెనమలూరుతో సంబంధాలు.. జెండా ఎగరడం ఖాయం..
గతంలో మా నియోజక వర్గంలో జరిగిన ప్రతి హత్య పై సాక్ష్యదారాలతో సహా గతంలో డీజీపీకి పిర్యాదు చేసిన అప్పుడు ఎవరు పట్టించుకోలేదని అన్నారు. అప్పుడు జరిగిన హత్యల గురించి ఆనాడు ప్రగతి భవన్ లో ఉన్న పెద్దలకు చెప్పిన ఎవరు పట్టించుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మీరు జనాలను పట్టించుకోలేదు కాబట్టి మిమ్ములను జనాలు ఓడగొట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. కొండగట్టులో 60 మంది చనిపోతే మీరు వెళ్ళలేదు కానీ వ్యక్తిగత కారణాలు, భూ వివాదాల వలన చనిపోయిన వ్యక్తి చావుతో శవ రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. గతంలో జరిగిన అన్యాయ ,అక్రమాల పై విచారణ చేపడతామన్నారు. మల్లేష్ యాదవ్ ఘటన పై విచారణ చేపిస్తున్నాము. సూత్రధారులను అరెస్ట్ చేస్తామన్నారు.
మీ ప్రభుత్వంలో వామన రావు కుటుంబ సభ్యుల హత్య, అక్రమ కేస్ లు, మరియమ్మ ఘటన, దిశ ఘటన, ఎఫ్ఆర్ఓ శ్రీనివాస రావు,మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంభం అగాయిత్యలు, తమ్మినేని కృష్ణ హత్యలు జరగలేదా? అని ప్రశ్నించారు. మా పాలనలో రాజకీయ కక్ష పూరితమైన కేస్ లు, అరెస్ట్ లు ఉండవన్నారు. దొంగలను వెనుకకు వేసుకుని వచ్చింది ఎవరు..గత ప్రభుత్వంలో మీరు కాదా? అని ప్రశ్నించారు. రాజకీయ హత్యలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. తను తప్పులు చేస్తే జనాలు 7 సార్లు గెలిపిస్తారా? అని తెలిపారు. ఎన్ని సార్లు చెప్పిన మీ పద్దతి మారడం లేదని మిమ్మల్ని జనాలు ఒడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Al Maha Rashed : మూడేళ్ల వయసులో రెండు పుస్తకాలు రాసి హిస్టరీ క్రియేట్ చేసిన చిన్నారి
తాజావార్తలు
-
Vijay – Trisha : అన్ఫాలో చేసిన త్రిష.. విజయ్తో ఇక బ్రేకప్?
-
Ranabali: విజయ్, రష్మిక సినిమా రిలీజ్ డేట్పై కొత్త సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
-
Kylian Mbappe డబుల్ స్ట్రైక్.. ఇరాక్పై 3-0తో ఫ్రాన్స్ విజయం.! నాకౌట్కు అర్హత..
-
Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..
-
Obsession: ‘రాజ్’ సినిమానే ‘అబ్సెషన్’నా? విక్రమ్ భట్ సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోలపై కూడా షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!