Jupally Krishna Rao: చర్చకు సిద్దమా..? హరీష్ రావుకు జూపల్లి సవాల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishna Rao: పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాలువలు తొవ్వకుండానే కేసీఆర్ ప్రాజెక్టు ప్రారంభించారని, హరీష్ రావు ఎక్కడికి వస్తావో చెప్పు ఎక్కడైనా చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ళలో ప్రజాధనం దోచుకుతిన్నారని మండిపడ్డారు. మళ్ళీ దోచుకునేందుకు హరీష్ రావు సచివాలయం ముట్టడి అంటున్నారని తెలిపారు. నీటి ఎద్దడికి బీఆర్ఎస్ కారణమని క్లారిటీ ఇచ్చారు. నీటి నిల్వలను ముందే ఎందుకు పెంచలేదు? అని ప్రశ్నించారు. వర్షాకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. పంట నష్టం పై ప్రభుత్వం సర్వే చేస్తుందన్నారు.
పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారైనా పంట నష్ట పరిహారం ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పరిపాలనలో 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వచ్చే వానాకాలం నుంచి అన్ని పంటలకు ప్రభుత్వమే భీమా సౌకర్యం కల్పింస్తుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాలువలు తొవ్వకుండానే కేసీఆర్ ప్రాజెక్టు ప్రారంభించారన్నారు. హరీష్ రావు ఎక్కడికి వస్తావో చెప్పు… ఎక్కడైనా చర్చకు సిద్ధంమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలకు ముందుంది ముసళ్ళ పండగా… అందరి బాగోతాలు బయటపడుతాయన్నారు.
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
Read also: Madhusudhan Reddy: బొజ్జలపై మధుసూదన్ రెడ్డి ఫైర్.. కేసు పెట్టాలి..!
కాంగ్రెస్ ప్రభుత్వంపై తాజాగా మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర పనులు చేస్తోందని మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో పర్యటన చేసినప్పుడు రైతుల కళ్లల్లో ఆవేదన.. కన్నీళ్లు చూశామని తెలిపారు. సత్తమ్మ అనే మహిళ నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని.. పైగా నాలుగు లక్షల రూపాయలు అప్పు అప్పు అయినట్లుగా ఆమె చెప్పిందని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో అయితే ఒక్క గుంట కూడా ఎండ లేదని గుర్తుచేశారు.
సంగారెడ్డి జిల్లాలో రైతులకు బ్యాంకులు నోటీసులు పంపి లోన్ కడతారా? లేదా? అని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాణస్వీకారం చేయగానే రుణమాఫీ చేస్తామని.. అది కూడా డిసెంబర్ 9నే చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తుచేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కారం చేయకపోతే రాష్ట్రంలోని లక్షలాది రైతులతో కలిసి సచివాలయం ముట్టడి చేస్తామని హరీశ్రావు హెచ్చరించిన విషయం తెలిసిందే..
Madhusudhan Reddy: బొజ్జలపై మధుసూదన్ రెడ్డి ఫైర్.. కేసు పెట్టాలి..!
తాజావార్తలు
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
-
Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?