Hyderabad: మైనర్ బాలిక ఆచూకీ లభ్యం.. 5 రోజులు, 200 సీసీ కెమెరాలు వడపోసిన హెడ్ కానిస్టేబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రోజుల తర్వాత జూబ్లీహిల్స్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కష్టం వల్లే బాలిక జాడ లభ్యమైంది. ఇటీవల తన 15 సంవత్సరాల కూతురు కనిపించడం లేదంటూ బాలిక తండ్రి ఐదు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తండ్రితో కలిసి నివసిస్తున్న మైనర్ బాలిక యూసఫ్ గూడలోని స్థానిక పాఠశాలలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో 5 నెలల క్రితం బాలిక తల్లి చనిపోవడంతో ఒంటరైన ఆమె డిప్రెషన్లోకి వెళ్లింది. స్కూల్కు సరిగ వెళ్లకపోవడంతో ఆమెను సోదరుడు మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక నవంబర్ 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read: UFO: ఇంఫాల్ ఎయిర్పోర్టుపై గుర్తుతెలియని వస్తువు కలకలం.. రంగంలోకి రఫేల్
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
కేసు నమోదు అనంతరం హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు బాలికను వెతికే పనిలో నిమగ్నమయ్యాడు. వెంకటగిరిలోని బాలిక నివాసం నుంచి కేసు దర్యాప్తు చేపట్టాడు. బాలిక నివాసం వద్ద స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించగా అక్కడ ఆమె ఆటో ఎక్కినట్టు గుర్తించారు. స్థానికంగా ఉన్న 30 సీసీ కెమెరాలు వడపోయగా పోలీసులు ఆటో నెంబర్ను గుర్తించి డ్రైవర్ను విచారించడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బాలికను దింపినట్టు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. దీంతో రైల్వే స్టేషన్ పరిధిలోని దాదాపు 75 సీసీ కెమెరాలు వడపోయగా ఆమె ఓ వ్యక్తితో మాట్లాడుతూ బయటకు వచ్చినట్టు గుర్తించారు. అతడితో స్కూటర్ ఎక్కి వెళ్లినట్టుగా సీసీ కెమోరాలో రికార్డు అయ్యింది. దీంతో అల్ఫా హోటల్ సమీపంలో 50 సీసీ కెమెరాలు పరిశీలించి మహాంకాళి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కోసం స్కూటర్ ఆపినప్పుడు బండి నెంబర్ను కనుగొన్నారు.
Also Read: Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు
బైక్ నంబర్ సహాయంతో పోలీసులు ఆ వ్యక్తి అడ్రస్ తెలుసుకుని విచారించారు. అతడిని పట్టుకుని ప్రశ్నించడంతో బాలిక ఆచూకి లభ్యమైంది. రైల్వే స్టేషన్ సదరు బాలిక ఏడుస్తూ కనిపించందని, ఏమైందని అడగడంతో తాను చనిపోతానంటూ చెప్పిందన్నాడు. దీంతో ఆమెకు ధైర్యం చెప్పి జూబ్లీ బస్స్టేషన్ వెయిటింగ్ రూంలో ఉంచామని తెలిపాడు. బాలిక మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించి ఆ మరుసటి రోజు ఆమెను మహాంకాళిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చానని అతడు పోలీసులు తెలిపాడు. దీంతో ఊపీరి పీల్చుకున్న పోలీసులు బాలిక కోసం ఆస్పత్రికి వెళ్లి ఆమెను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక కోసం నిద్రహరాలు మాని 5 రోజుల పాటు దాదాపు 200 సీసీ కెమెరాలు వడపోసి బాలిక ఆచూకి కనుగొన్న హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావును అందరు ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!