Jogulamba Gadwal: కొండాపురం గ్రామంలో వరుస మరణాలు.. 13 రోజులలో 11 మంది మృతి
- కొండాపురం గ్రామంలో వరుస మరణాలు కలకలం..
- 13 రోజులలో 11 మంది మృతి చెందడంతో భయాందోళనలో ప్రజలు..
Jogulamba Gadwal: కొండాపురం గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. 13 రోజులలో 11 మంది మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో ఏదో జరుగుతుందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ఏదో పట్టి పీడిస్తుందని హోమాలు, పూజలు చేస్తున్నారు. పెద్దవాళ్లు వృద్ధులు పిల్లలతో సహా కలిపి ఏకంగా 11 మంది మృత్యువాత పడటంతో గ్రామ ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు. అసలు కొండాపురంలో ఏం జరుగుతుంది అంటూ అనుమాలు వ్యక్తమవుతున్నాయి.
Read also: Success Story: హోటల్లో వెయిటర్గా ప్రస్థానం..ఇప్పుడు నెలకు రూ.18 కోట్ల సంపాదన
Also Read
- Road Accident: అదుపుతప్పి బోల్తాపడ్డ బస్సు.. 20 మందికి గాయాలు!
- OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
- Tragic Accident: విషాదం.. ట్రాక్టర్ రివర్స్ తీసుకుంటుంగా ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి...
- Son Kills Father: మనిషి కాదు.. నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా..!
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం, కేటి దొడ్డి మండలం, కొండాపురం గ్రామంలో వరుస మరణాలతో గ్రామప్రజలులో బెంబేలెత్తుతున్నారు. 13 రోజులలో పెద్దవాళ్లు వృద్ధులు పిల్లలతో సహా కలిపి 11 మంది మృతి చెందారు. కొండాపురం గ్రామం కు ఏదో జరిగిందంటూ ఆదివారం అమావాస్య రోజు హోమంతో పూజలు చేపట్టారు గ్రామస్థులు. ఇంటికి 500 చొప్పున వసూలు చేసి కడప నుంచి ఓ వ్యక్తిని తీసుకువచ్చిన హోమం, పూజలు చేశారు. హోమంతో పూజలు చేస్తే గ్రామానికి మేలు జరుగుతుందని.. ఆదివారం అమావాస్య కావడంతో పూజలు చేశారు. గ్రామానికి ఏదో పీడ పట్టిందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read also: John Cena: ఆ హీరో మాటలు నా జీవితాన్ని మార్చాయి: జాన్ సీనా
11 మంది మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో మృత్యువాత పడ్డ కుటుంబాలతో సహా రూ.500లు వసూలు చేసి గ్రామంలో నిన్న ఆదివారం హోమం పూజలు చేశారు. దీంతో గ్రామ ప్రజలు పీడ పోయిందంటూ ఊరిపి పీల్చుకున్నారు. మరి కొందరు ఇది పీడ కాదు వీరి అనుమానం అంటూ కొట్టి పారేస్తున్నారు. వర్షాకాలంలో రోగాల బారిన పడటం సహజమని చెబుతున్నారు. మూఢనమ్మకాలతో ఆ గ్రామం అనుమానంతో జీవనం సాగిస్తుందని తెలిపారు. ఏది ఏమైనా ఆ గ్రామంలో 13 రోజుల్లో 11 మంది చనిపోవడం పలు అనుమానాలకు తావులేపుతుంది. దీనిపై అధికారులు పట్టించుకుంటారా? లేక గ్రామస్తుల మూఢ నమ్మకాలకు వదిలేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Read also: Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద..
మరోవైపు భాద్రాద్రి కొత్తగూడం ఆళ్లపల్లి మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం రేపుతున్నాయి. ఎస్సీ కాలనీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు పసుపు, కొబ్బరికాయలు ఉంచి, పందిని బలి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అది చూసిన గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు పట్టించుకుని క్షుద్ర పూజలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Jeffrey Vandersay: నేను 6 వికెట్లు తీసినా.. ఈ గెలుపు క్రెడిట్ మాత్రం వారిదే: వాండర్సే
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?