KTR: సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేది..! కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు అన్నారు. జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు నిజాం సాగర్ మండలం లో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదన్నారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందన్నారు. ‘బంధు ‘పథకాల ప్రభావం మనపై పడిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని అన్నారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవని అన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని కేటీఆర్ అన్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. ఇక మరోవైపు BRS ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తి తో గెలవలేదు .మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారని అన్నారు. కార్యకర్తలది తప్పు కాదు నాయకులుగా మనమే భాద్యత వహించాలని కోరారు. పార్టీలో ప్రక్షాళన జరగాలని, గ్రూపు తగాదాలకు స్వస్తి పలకాలని అన్నారు.
Also Read
Read also: Guntur Kaaram: సలార్ ట్రైలర్ 32.58 మిలియన్ వ్యూస్… ఈరోజు ఏం చేస్తాడు మీ హీరో?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ ఎన్నికల్లో పుంజుకోవాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానం వరుస సమావేశాలు నిర్వహించింది. మాజీ మంత్రి కేటీఆర్ను సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా నిలబెట్టాలని గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా పోస్టులు పెడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ మళ్లీ ఊపందుకుంది.
DCP Srinivas Rao: రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసు.. డీసీపీ శ్రీనివాసరావు క్లారిటీ..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!