Jaya Jaya Telangana: రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణ… పాట రాసింది ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaya Jaya Telangana: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ పాటను ప్రముఖ కవి అందెశ్రీ రాశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందే ఈ పాట రాశారు.
జయ జయహే తెలంగాణ… జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
Read also: Ponguleti Srinivas Reddy: టీఎస్ కాదు టీజీ.. పేరు మార్పుపై పొంగులేటి క్లారిటీ..!
‘నాది కవిగానం కాదు, కాలజ్ఞానం’ అంటాడు అందెశ్రీ ఆయన చదువుకోలేదు. అందెశ్రీ జనగామ జిల్లా రేవర్తికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన పశువుల కాపరి. తాపీ మేస్త్రీగా పనిచేశారు. 21 ఏళ్లుగా అదే ఆయనకు ఉద్యోగం. అయితే.. కవిత్వం ఆయనకు సహజంగానే వచ్చింది. రాయడం నేర్చుకున్నాడు.. విద్యావంతుడయ్యాడు. డిగ్రీ లేదు కానీ అనేక విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు పొందారు. నదులపై కవిత్వం రాస్తూ ప్రపంచమంతా తిరిగాడు. మిస్సిస్సిప్పి, మిస్సోరీ, అమెజాన్, నైల్ లాంటి మహానదుల వెంట ప్రయాణిస్తూ… నదులపై పెద్ద కవిత రాసే పనిలో పడ్డాడు. ‘నిప్పుల వాగు’ పేరుతో వెయ్యేళ్ల నాటి తెలంగాణ పాటను తాజాగా రికార్డు చేశారు. జయజయహే తెలంగాణ.. పాట ఎలా రాశారో చెబుతూ.. తెలంగాణ సాధన సందర్భంగా 2003 మార్చి 2న కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ధూంధాం కార్యక్రమంలో.. మనకంటూ ఓ పాట ఉండకూడదని అనిపించిందట.. అంతే.. ఆ సమయంలో ఈ పాట అతడిని తాకింది.
Read also: UP Road Accident: వర్షంలో వేగంగా వెళ్లిన కారు.. గొయ్యిలో పడి ఆరుగురు మృతి
ఆ ఆలోచన వచ్చిన కొద్దిసేపటికే నాలుగు చరణాలు రాశాడు. మొదటి నాలుగు చరణాలు. తర్వాత 2003 నవంబరు 11న ఆదిలాబాద్లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక జెండా వందనంలో వీటిని ఆలపించారు. విన్నవారంతా ఏదో తెలియని మైమరుపు.. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాట పాడుతూనే ఉన్నారు. రాస్తూనే ఉన్నాడు. మొత్తం 12 చరణాలు. నిజానికి ఈ పాట తెలంగాణ ప్రకటన తర్వాత 9 డిసెంబర్ 2009 తర్వాత కోట్లాది మందికి చేరింది. కానీ, అంతకుముందే ప్రధాన సమావేశాల్లోని కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులకు ఈపాట నోట చేరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని తెలిపారు. కానీ ఎందుకో జరగలేదు.. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈపాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. దాంతో ఇప్పుడు వాస్తవం కాబోతోంది.
UP Road Accident: వర్షంలో వేగంగా వెళ్లిన కారు.. గొయ్యిలో పడి ఆరుగురు మృతి
తాజావార్తలు
-
Trump warns Iran: హార్ముజ్ జలసంధి మూసేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
T20 World Cup : ఆస్ట్రేలియా కాదు, ఇంగ్లాండ్ కాదు.. ఇండియాని వణికిస్తున్న జట్టు ఇదే!
-
Vijay Birthday : రూ.70లక్షలు, 15 లారీలు.. విజయ్ జీవితాన్ని మలుపుతిప్పిన రోజు!
-
Vaibhav suryavanshi: 2026 “వైభవ్” నామ సంవత్సరం.. వామ్మో 7 నెలల్లో ఇన్ని రికార్డులా?
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!