ప్రజలు అభిమానించినప్పుడే అధికారంలోకి వస్తాం: జానారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల సమస్యలపై పీసీసీ తలపెట్టిన ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేసీఆర్పై విమర్శల దాడి చేశారు. ప్రజలు ఎప్పుడు అభిమానిస్తే అప్పుడే అధికారంలోకి వస్తామని జానా రెడ్డి అన్నారు. పీసీసీ చేపట్టిన ఆందోళనకు అభినందలు చెబుతున్నాని ఆయన అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారించాలని కేంద్ర, రాష్ర్టా ప్రభుత్వాలను హెచ్చరించారు. పదవుల కోసమే… ప్రభుత్వం వస్తోందనో… స్వాతంత్ర్య ఉద్యమం చేయడం లేదని.. రైతుల కోసం చేస్తున్నామని జానా అన్నారు. కాంగ్రెస్ ఏం చేసింది అని అడిగే వారికి చెబుతున్నా అంటూ ఘాటు వ్యాఖ్యలతో సమాధానం చెప్పారు జానారెడ్డి. అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఆహారభద్రత, ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం తెచ్చింది, అవినీతికి వ్యతిరేకంగా చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు జానారెడ్డి.
టీఆర్ఎస్ను ఉద్దేశించి హాట్ కామెంట్లు చేశారు జానారెడ్డి.. మీ అధికారం గుంజుకోవాలని కాదు, మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతుల సమస్యలను పక్కన పెడుతున్నారన్నారు. కేంద్రం..రాష్ట్రం సమస్యలు ఒకరి మీద ఒకరూ నెట్టుకుంటున్నారు. మీ ఇద్దరికి బుద్ధి చెప్పి ప్రజలు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకోస్తారన్నారు. . కాంగ్రెస్ అధికారంలోకి రావడం అవసరం అని ప్రజలు భావించేలా పని చేయాలని సభ స్థలి నుంచి కార్యకర్తలకు ఆయన సూచించారు. అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి… సమస్యల కోసం ఏకం అవ్వడన్ని కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతిస్తారని జానా రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తోందని జానా రెడ్డి వెల్లడించారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!