ప్రజలు అభిమానించినప్పుడే అధికారంలోకి వస్తాం: జానారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల సమస్యలపై పీసీసీ తలపెట్టిన ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేసీఆర్పై విమర్శల దాడి చేశారు. ప్రజలు ఎప్పుడు అభిమానిస్తే అప్పుడే అధికారంలోకి వస్తామని జానా రెడ్డి అన్నారు. పీసీసీ చేపట్టిన ఆందోళనకు అభినందలు చెబుతున్నాని ఆయన అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారించాలని కేంద్ర, రాష్ర్టా ప్రభుత్వాలను హెచ్చరించారు. పదవుల కోసమే… ప్రభుత్వం వస్తోందనో… స్వాతంత్ర్య ఉద్యమం చేయడం లేదని.. రైతుల కోసం చేస్తున్నామని జానా అన్నారు. కాంగ్రెస్ ఏం చేసింది అని అడిగే వారికి చెబుతున్నా అంటూ ఘాటు వ్యాఖ్యలతో సమాధానం చెప్పారు జానారెడ్డి. అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఆహారభద్రత, ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం తెచ్చింది, అవినీతికి వ్యతిరేకంగా చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు జానారెడ్డి.
టీఆర్ఎస్ను ఉద్దేశించి హాట్ కామెంట్లు చేశారు జానారెడ్డి.. మీ అధికారం గుంజుకోవాలని కాదు, మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతుల సమస్యలను పక్కన పెడుతున్నారన్నారు. కేంద్రం..రాష్ట్రం సమస్యలు ఒకరి మీద ఒకరూ నెట్టుకుంటున్నారు. మీ ఇద్దరికి బుద్ధి చెప్పి ప్రజలు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకోస్తారన్నారు. . కాంగ్రెస్ అధికారంలోకి రావడం అవసరం అని ప్రజలు భావించేలా పని చేయాలని సభ స్థలి నుంచి కార్యకర్తలకు ఆయన సూచించారు. అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి… సమస్యల కోసం ఏకం అవ్వడన్ని కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతిస్తారని జానా రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తోందని జానా రెడ్డి వెల్లడించారు.
Also Read
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
తాజావార్తలు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!