MLC Jeevan Reddy: తెలుసుకొని మాట్లాడు.. హరీష్ రావుపై జీవన్ రెడ్డి ఫైర్
- హరీష్ రావు తెలుసుకొని మాట్లాడాలి..
- హరీష్ రావు పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్..
- కాంగ్రెస్ హయం లో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్..
- ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: హరీష్ రావు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచిందని క్లారిటీ ఇచ్చారు. ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ ల ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుల పై మండిపడ్డారు. ధాన్యం సేకరణలో గత ఖరీఫ్ కంటే ముందంజలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందన్నారు.
Read also: DK Aruna: నేను ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా..?
Also Read
ప్రభుత్వం మూసి ప్రక్షాళన అవశ్యకత ను గుర్తించి మూసి ప్రక్షాళన మొదలు పెట్టారని తెలిపారు. మూసి ప్రక్షాళన లో నిర్వసితుల కు న్యాయం చేసిన తర్వాతే మూసి ప్రక్షాళన మొదలు పెడుతామన్నారు. ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు చేసిన రుణమాఫీ కేవలం వడ్డీ మాఫీగానే మిగిలిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏక కాలంలో రూ.18000 కోట్లతో రైతుల కు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామన్నారు. రుణమాఫీ కాని రైతులకు ఈనెల చివరిలో పూర్తిగా రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
Read also: Komatireddy Venkat Reddy: దాడులకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయడానికి వెనకాడం..
హరీష్ రావు ఫై విప్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. సాంకేతిక కారణలతో రైతు రుణమాఫీలో కొంత జాప్యం జరిగిందన్నారు. రుణమాఫీ కాని రైతుల సమస్య గురించి సీఎం దృష్టి కి తీసుకెళ్ళామన్నారు. హరీష్ రావు ఎక్కడికి రమ్మంటావు.. 65 వేల కుటుంబలకు రుణమాఫీ చేసామన్నారు. జిల్లా అభివృద్ధి, రైతు రుణమాఫీలో తెల్చుకుందామా ఎక్కడికి రమ్మంటావో చెప్పు హరీష్ రావు అని సవాల్ విసిరారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రైతు నైన పరామర్శించారా? అని ప్రశ్నించారు. డబ్బుల సంచుల సంస్కృతి మాది కాదు.. మీ మామ కేసీఆర్ ది హరీష్ రావు అన్నారు. హరీష్ రావుకు 70 ఎంఎం చూపిస్తా అన్నారు. ధర్మపురిలో పూజలు, యాగాలు చేసిన కేసీఆర్.. 500 కోట్లు కేటాయిస్తాను అని అన్నావు ధర్మపురి అభివృద్ధికి ఏం అయ్యిందని ప్రశ్నించారు.
Terrible Incident: భద్రాద్రి మహిళ మిస్సింగ్ కేసు విషాదాంతం.. 20 ముక్కలు చేసి పొలంలో..
తాజావార్తలు
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!