MLC Jeevan Reddy: తెలుసుకొని మాట్లాడు.. హరీష్ రావుపై జీవన్ రెడ్డి ఫైర్
- హరీష్ రావు తెలుసుకొని మాట్లాడాలి..
- హరీష్ రావు పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్..
- కాంగ్రెస్ హయం లో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్..
- ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: హరీష్ రావు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచిందని క్లారిటీ ఇచ్చారు. ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ ల ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుల పై మండిపడ్డారు. ధాన్యం సేకరణలో గత ఖరీఫ్ కంటే ముందంజలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందన్నారు.
Read also: DK Aruna: నేను ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా..?
Also Read
ప్రభుత్వం మూసి ప్రక్షాళన అవశ్యకత ను గుర్తించి మూసి ప్రక్షాళన మొదలు పెట్టారని తెలిపారు. మూసి ప్రక్షాళన లో నిర్వసితుల కు న్యాయం చేసిన తర్వాతే మూసి ప్రక్షాళన మొదలు పెడుతామన్నారు. ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు చేసిన రుణమాఫీ కేవలం వడ్డీ మాఫీగానే మిగిలిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏక కాలంలో రూ.18000 కోట్లతో రైతుల కు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామన్నారు. రుణమాఫీ కాని రైతులకు ఈనెల చివరిలో పూర్తిగా రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
Read also: Komatireddy Venkat Reddy: దాడులకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయడానికి వెనకాడం..
హరీష్ రావు ఫై విప్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. సాంకేతిక కారణలతో రైతు రుణమాఫీలో కొంత జాప్యం జరిగిందన్నారు. రుణమాఫీ కాని రైతుల సమస్య గురించి సీఎం దృష్టి కి తీసుకెళ్ళామన్నారు. హరీష్ రావు ఎక్కడికి రమ్మంటావు.. 65 వేల కుటుంబలకు రుణమాఫీ చేసామన్నారు. జిల్లా అభివృద్ధి, రైతు రుణమాఫీలో తెల్చుకుందామా ఎక్కడికి రమ్మంటావో చెప్పు హరీష్ రావు అని సవాల్ విసిరారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రైతు నైన పరామర్శించారా? అని ప్రశ్నించారు. డబ్బుల సంచుల సంస్కృతి మాది కాదు.. మీ మామ కేసీఆర్ ది హరీష్ రావు అన్నారు. హరీష్ రావుకు 70 ఎంఎం చూపిస్తా అన్నారు. ధర్మపురిలో పూజలు, యాగాలు చేసిన కేసీఆర్.. 500 కోట్లు కేటాయిస్తాను అని అన్నావు ధర్మపురి అభివృద్ధికి ఏం అయ్యిందని ప్రశ్నించారు.
Terrible Incident: భద్రాద్రి మహిళ మిస్సింగ్ కేసు విషాదాంతం.. 20 ముక్కలు చేసి పొలంలో..
తాజావార్తలు
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!