Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
- ఎమిరేట్స్ హైవేపై మినీ బస్సు-లారీ ఢీకొన్న ఘటన
- మొత్తం ఏడుగురు వలస కార్మికులు దుర్మరణం
- జగిత్యాల జిల్లా మూడు కుటుంబాల్లో విషాదం
- మృతదేహాల తరలింపునకు భారత కాన్సులేట్ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dubai Road Accident: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన జగిత్యాల జిల్లా బిడ్డలను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. దుబాయిలోని ఎమిరేట్స్ రహదారిపై జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదంలో మొత్తం ఏడుగురు వలస కార్మికులు మృతి చెందగా, వారిలో ముగ్గురు జగిత్యాల జిల్లాకు చెందిన వారు కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. షార్జాలోని ఒక అల్యూమినియం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా విధి నిర్వహణలో భాగంగా మినీ బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎమిరేట్స్ హైవేపై ఒక లారీ సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోగా, వేగంగా వస్తున్న కార్మికుల మినీ బస్సు ఆ వాహనాన్ని వెనుక నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద ధాటికి మినీ బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయి అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటనలో జగిత్యాల రూరల్ మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం, తక్కళ్ళపల్లికి చెందిన తిరుపతి గౌడ్, , మెట్పల్లి పట్టణానికి చెందిన అబ్దుల్ రఫీఖ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురు కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
- Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
- Rythu Bharosa : రైతులకు పెట్టుబడి సాయం.. మరో రూ.1,009 కోట్లు విడుదల
- AI Training : మైనారిటీ విద్యార్థులకు ‘ఏఐ’ శిక్షణ.. తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
విషయం తెలిసిన వెంటనే దుబాయిలోని భారత కాన్సులేట్ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు సేకరించిన అధికారులు, మృతదేహాలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన చట్టపరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లిన కుటుంబ యజమానులు ఇలా శవాలై వస్తున్నారనే వార్త వినడంతో జగిత్యాల జిల్లాలోని ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, ప్రభుత్వం త్వరగా స్పందించి మృతదేహాలను రప్పించాలని, తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!