Jaggareddy: కాంగ్రెస్ కి 70 సీట్లు పక్కా.. నా మీద ఐటీ దాడులు చేస్తే వాళ్లే ఇచ్చి పోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: కాంగ్రెస్ కి 70 సీట్లు పక్కా అని.. నా మీద ఐటీ దాడులు చేస్తే వాళ్లే ఇచ్చి పోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెఎల్ఆర్ దగ్గర ఎమున్నాయ్ అని ఐటీ దాడులు చేస్తున్నారు అని ప్రశ్నించారు. నా మీద దాడి చేస్తే.. ఐటీ వాళ్లే ఇచ్చి పోవాలని.. ఐటీ వాళ్ళు వస్తే.. అప్పులు లెక్క పెట్టి… డబ్బులు ఇచ్చి పోవాలని వ్యంగాస్త్రం వేశారు. తెలంగాణలో ప్రజలు అంతా కాంగ్రెస్ తో ఉన్నారని అన్నారు. ఈ సారి కాంగ్రెస్ కి 70 సీట్లు వస్తాయన్నారు. సింగిల్ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఎంఐఎం సినిమా హైదరాబాద్ కె పరిమితమని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంఐఎం.. బీఆర్ఎస్ .. బీజేపీ ఒక్కటే అన్నారు. బీజేపీ ఆడుతున్న అటలో బీఆర్ఎస్, ఎంఐఎం పావులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అర్థం చేసుకోండని తెలిపారు. బీజేపీ.. బీఆర్ఎస్.. కాంగ్రెస్ అధికారంలోకి రావద్దని కుట్ర చేస్తున్నారని తెలిపారు. బండి సంజయ్.. కవిత ను జైల్ కి పంపిస్తా అన్నారు.. కవిత అరెస్ట్ సడన్ గా ఆగిపోయింది? అని ప్రశ్నించారు. కవిత అరెస్ట్ ఆగిపోగానే.. బీజేపీ వాళ్ళ ఆశలు గల్లంతు అయ్యాయని తెలిపారు. కిషన్ రెడ్డి అయితే సప్పుడు చెయ్యకుండా కూర్చుంటారు అని బీజేపీ కిషన్ రెడ్డి కి ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీ గెలిచే దమ్ము లేదు కాబట్టి.. బీఆర్ఎస్ ని అడ్డం పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్ట్ అపి..బీఆర్ఎస్ ని పెంచే పనిలో పడింది బీజేపీ అని ఆరోపించారు. మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కి రాకుండా ఉండేందుకు.. ఎంఐఎం బీజేపీ కి సైనికుడిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
ఎంఐఎం 7 ఎమ్మెల్యేలను పాతబస్తీ లో ఓడించండి.. మీ బతుకులు మార్చేస్తుంది కాంగ్రెస్ ఉందన్నారు. కాంగ్రెస్ తరపున మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా? అని హామీ ఇచ్చారు. దారూసలం ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అన్నారు. రేవంత్.. కొడంగల్.. కామారెడ్డి లో పోటీ చేస్తున్నాడు.. . నన్ను కూడా ఎక్కడైనా పోటీ చెయ్ అంటే పోటీకి నేను కూడా సిద్ధం మని క్లారిటీ ఇచ్చారు. జగ్గారెడ్డి భయపడే వాడా..? హరీష్ వంద పంచులు వేసినా.. నేను ఒక్కటే వేస్తే చాలు అని అన్నారు. సంగారెడ్డి లో పేదలకు 100 గజాలు స్థలం ఇంటి జాగా ఇవ్వాలని నా కోరిక అన్నారు.
రైతులకు డబ్బులు ఇచ్చి 2000 ఎకరాలు తీసుకుని ఇంటి జాగా ఇస్తా అన్నారు. నాకు మా ఇంట్లో నా బిడ్డే ప్రత్యర్థి అన్నారు. నేను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నా బిడ్డనే నిలదిస్తది అన్నారు. రేవంత్.. నేను అన్నదమ్ముల లాంటి వాళ్ళం అన్నారు. చిన్న సమస్యలు వస్తాయి.. అయిపోయింది పంచాయితీ అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని.. ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు. సీక్రెట్..సైలెంట్ ఓటింగ్ ఐతదన్నారు. సునామీ వస్తుంది..70 సీట్లు వస్తాయని క్లారిటీ ఇచ్చారు. 57 ఏండ్ల వళ్లకు పెన్షన్ ఇస్తా అన్నావు.. ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
ట్రెండింగ్
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!