Jagga Reddy : లక్ష కోట్లలో 30% తినేసి.. హరీష్ రావు ప్రాజెక్టు దగ్గర పడుకున్నాడు
- కాళేశ్వరం అవినీతి.. లక్ష కోట్లు వేశారంటే 30 వేల కోట్లు కొట్టేశారా?
- కేసీఆర్ కూతురు ఢిల్లీ దుకాణం.. కుటుంబమే డాన్ల సంస్థగా మారిందన్న జగ్గారెడ్డి
- లిక్కర్ మాఫియా.. కేటీఆర్ బావమరిది-సంతోష్ సుట్టాలపై సంచలన ఆరోపణలు
- రేవంత్ బెడ్రూంలోకి పోలీసులు.. ఇది హద్దులు దాటి చేసిన దౌర్జన్యం : జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి బీఆర్ఎస్ (BRS) నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల లోపాలు, అవినీతి, లిక్కర్ దందాలు, భూ కబ్జాలు అంటూ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. మీడియాతో మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించామని చెబుతారు. అందులో కనీసం 30 శాతం అంటే 30 వేల కోట్లు తినేశారు. హరీష్ రావు అందుకే ప్రాజెక్టు దగ్గరే పడుకున్నాడు. దమ్ముంటే ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలి,” అని జగ్గారెడ్డి అన్నారు.
“మీరు దొంగలు.. మాపై నిందలు వేస్తారా? మీ పార్టీలా మేము ప్రైవేటు కంపెనీ అనుకున్నామా? ఔటర్ రింగ్ రోడ్ లీజుకు ఇచ్చి దాంట్లో డబ్బులు కొట్టారు. అప్పుల్లో కూడా కమిషన్లు వసూలు చేశారు. ఇలాంటి దందా ఎవడు చేయడు.. కానీ మీరు చేశారు,” అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కేసీఆర్ కూతురు ఢిల్లీ లో పెద్ద దుకాణం తెరిచింది. కేజ్రీవాల్ కథ ముగిసిపోయింది. కేసీఆర్ కుటుంబం మొత్తం డాన్ల కంపెనీ అయింది. మిగిలింది ఏమీ లేదు.. చెరువులు కూడా మింగేశారు,” అని వ్యాఖ్యానించారు.
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
Tension in Nandigama: వైఎస్ విగ్రహం తొలగింపు.. నందిగామలో టెన్షన్ టెన్షన్..
“లిక్కర్ దందా పెద్దమ్మ గుడి కమాన్ నుంచి మాదాపూర్ దాకా రాత్రి రెండు గంటల వరకు సాగుతోంది. నేను పోలీసులను అడిగితే అది కేటీఆర్ బామ్మర్ది దందా అంటున్నారు. రోడ్డుకి లెఫ్ట్ కేటీఆర్ బావమరిది, రైట్ సంతోష్ సుట్టాలు.. ఇది ఏమి దందా? మొగోడివైతే స్పందించు ప్రభాకర్ రెడ్డి,” అంటూ కౌంటర్ వేశారు. “రేవంత్ రెడ్డిని ఎంతగా వేధించారు. జగ్గారెడ్డి, రేవంత్ ఇద్దరమూ కేసీఆర్ కుట్రల బాధితులమే. రేవంత్ బెడ్రూం వరకు పోలీసులు చొరబడ్డారు. ఇది ఏ స్థాయి దౌర్జన్యం చెప్పండి. కానీ రేవంత్ మాత్రం మిమ్మల్ని కొడుతున్నాడా? తిడుతున్నాడా?” అంటూ ప్రశ్నించారు.
“బీజేపీ వాళ్ల మాటలు పట్టించుకోవద్దు. గాంధీ కుటుంబం మాత్రమే దేశ మత సామరస్యాన్ని కాపాడుతుంది. కరెన్సీ మీద గాంధీ బొమ్మ లేకుండా చేయాలి అనేది బీజేపీ లైన్. వాళ్లది బ్లాక్ మెయిల్ దందా,” అంటూ కేంద్రంపై మండిపడ్డారు.
US President’s Salary: యూఎస్ ప్రెసిడెంట్ సాలరీ ఎంతో తెలుసా..?
తాజావార్తలు
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!