Jagga Reddy : లక్ష కోట్లలో 30% తినేసి.. హరీష్ రావు ప్రాజెక్టు దగ్గర పడుకున్నాడు
- కాళేశ్వరం అవినీతి.. లక్ష కోట్లు వేశారంటే 30 వేల కోట్లు కొట్టేశారా?
- కేసీఆర్ కూతురు ఢిల్లీ దుకాణం.. కుటుంబమే డాన్ల సంస్థగా మారిందన్న జగ్గారెడ్డి
- లిక్కర్ మాఫియా.. కేటీఆర్ బావమరిది-సంతోష్ సుట్టాలపై సంచలన ఆరోపణలు
- రేవంత్ బెడ్రూంలోకి పోలీసులు.. ఇది హద్దులు దాటి చేసిన దౌర్జన్యం : జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి బీఆర్ఎస్ (BRS) నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల లోపాలు, అవినీతి, లిక్కర్ దందాలు, భూ కబ్జాలు అంటూ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. మీడియాతో మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించామని చెబుతారు. అందులో కనీసం 30 శాతం అంటే 30 వేల కోట్లు తినేశారు. హరీష్ రావు అందుకే ప్రాజెక్టు దగ్గరే పడుకున్నాడు. దమ్ముంటే ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలి,” అని జగ్గారెడ్డి అన్నారు.
“మీరు దొంగలు.. మాపై నిందలు వేస్తారా? మీ పార్టీలా మేము ప్రైవేటు కంపెనీ అనుకున్నామా? ఔటర్ రింగ్ రోడ్ లీజుకు ఇచ్చి దాంట్లో డబ్బులు కొట్టారు. అప్పుల్లో కూడా కమిషన్లు వసూలు చేశారు. ఇలాంటి దందా ఎవడు చేయడు.. కానీ మీరు చేశారు,” అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కేసీఆర్ కూతురు ఢిల్లీ లో పెద్ద దుకాణం తెరిచింది. కేజ్రీవాల్ కథ ముగిసిపోయింది. కేసీఆర్ కుటుంబం మొత్తం డాన్ల కంపెనీ అయింది. మిగిలింది ఏమీ లేదు.. చెరువులు కూడా మింగేశారు,” అని వ్యాఖ్యానించారు.
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
Tension in Nandigama: వైఎస్ విగ్రహం తొలగింపు.. నందిగామలో టెన్షన్ టెన్షన్..
“లిక్కర్ దందా పెద్దమ్మ గుడి కమాన్ నుంచి మాదాపూర్ దాకా రాత్రి రెండు గంటల వరకు సాగుతోంది. నేను పోలీసులను అడిగితే అది కేటీఆర్ బామ్మర్ది దందా అంటున్నారు. రోడ్డుకి లెఫ్ట్ కేటీఆర్ బావమరిది, రైట్ సంతోష్ సుట్టాలు.. ఇది ఏమి దందా? మొగోడివైతే స్పందించు ప్రభాకర్ రెడ్డి,” అంటూ కౌంటర్ వేశారు. “రేవంత్ రెడ్డిని ఎంతగా వేధించారు. జగ్గారెడ్డి, రేవంత్ ఇద్దరమూ కేసీఆర్ కుట్రల బాధితులమే. రేవంత్ బెడ్రూం వరకు పోలీసులు చొరబడ్డారు. ఇది ఏ స్థాయి దౌర్జన్యం చెప్పండి. కానీ రేవంత్ మాత్రం మిమ్మల్ని కొడుతున్నాడా? తిడుతున్నాడా?” అంటూ ప్రశ్నించారు.
“బీజేపీ వాళ్ల మాటలు పట్టించుకోవద్దు. గాంధీ కుటుంబం మాత్రమే దేశ మత సామరస్యాన్ని కాపాడుతుంది. కరెన్సీ మీద గాంధీ బొమ్మ లేకుండా చేయాలి అనేది బీజేపీ లైన్. వాళ్లది బ్లాక్ మెయిల్ దందా,” అంటూ కేంద్రంపై మండిపడ్డారు.
US President’s Salary: యూఎస్ ప్రెసిడెంట్ సాలరీ ఎంతో తెలుసా..?
తాజావార్తలు
-
Abhishek Banerjee: “నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు”.. చిక్కుల్లో మమత మేనల్లుడు
-
Vinesh Phogat: వినేష్ ఫోగట్కు బిగ్ షాక్.. ఆసియా క్రీడల నుంచి ఔట్
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..