Jagadish Reddy: రైతుల జీవితాలతో దోబూచులాడొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు పడించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే సేకరించాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ లోని లక్ష్మీ గార్డెన్స్ లో టీఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి, జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ దేశములో పండే ప్రతి వరి గింజను కొనాలని ఉంది. కానీ ఆ బాద్యత నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే బీజేపీ , కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి తెలంగాణ రైతాంగం తో దోబూచులాడుతున్నారు. ఒకవైపు బీజేపీ పార్టీ గా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్టం అంత తిరిగి వరి ధాన్యం పండించాలని చెప్పాడు. మరో వైపు కేంద్ర మంత్రులు దాన్యం కొనలేమని రకరకాల పేర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండే ప్రతి ధాన్యం గింజ కొనాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారన్నారు.
Also Read
తెలంగాణ కోసం ఆనాడు ఉద్యమం చెసినట్లే, మరో ఉద్యమం చేసైనా తెలంగాణ రైతాంగం హక్కులు కాపాడతాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొద్దిమంది పెట్టుబడి దారులకు అనుకూలమైన చట్టాలు చేస్తూ..కోట్లాది మంది రైతాంగానికి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ వైఖరి ని ఎండగడుతూ ఇంటింటికి తీసుకువెళ్లేందుకే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా తెలంగాణలో పండే ధాన్యం కొనేలా చేస్తాం. రైతులకు అండగా నిలబడతాం అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!