Jagadish Reddy: మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే.. కాషాయం కనుచూపు మేరలో లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy comments on komatireddy rajgopal reddy: మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే గెలుపొందుతునందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంల పుట్టపాకలో కార్యకర్తల కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఎగిరేగి గులాబీ జెండాయే అని ఆయన అన్నారు. కాషాయం కనుచూపు మేరలో లేదని వ్యాఖ్యానించారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన అన్నారు. సర్వేలన్నీ తేల్చి చెబుతోంది ఇదే అని అన్నారు.
Read Also: BJP: ఏపీలో బీజేపీ భారీ స్కెచ్.. ఏకంగా 5 వేల సభలు..!
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
కోమటిరెడ్డి బ్రదర్స్ కు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని.. ఆ పార్టీ పతనం అంచున చేరే సరికి బీజేపీ పాట పాడుతున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వి బ్రోకర్ మాటలు, బ్రోకర్ దందాలు అని విమర్శించారు. అన్ని నియోజకవర్గాలకు నిధులు సమానంగా ఇచ్చామని ఆయన అన్నారు. అబద్దాలు చెప్పడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ను మించిన వాళ్లు లేరని ఎద్దేవా చేశారు. మూడేళ్ల నుంచి బీజేపీ కోవర్ట్ గా రాజగోపాల్ రెడ్డి పనిచేశారని ఆరోపించారు. కాంట్రాక్టుల ఒప్పందం కుదరగానే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అన్నారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలే వస్తాయి అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్ది ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో పాటు మునుగోడు శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహించాయి. ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఫిక్స్ కాకున్నా.. అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ప్రారంభించాయి.
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..