Inter Practical Exams: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా 3.55 లక్షల మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter Practical Exams: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు మార్చి 2 వరకు కొనసాగనుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 3.55 లక్షల మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 2201 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని తెలిపారు. ఇంటర్ బోర్డులో కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, కళాశాల యాజమాన్యానికి ఏమైనా సందేహాలుంటే నేరుగా 040-24600110 నంబర్కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కంట్రోల్ రూం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Read also: Weather Update: నేడు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు.. మండనున్న ఎండలు
Also Read
- Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
ఈ ఏడాది ప్రాక్టికల్ పరీక్షలు ఫస్టియర్లో 70 శాతం, సెకండియర్లో 100 శాతం సిలబస్ ఆధారంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. రోజుకు రెండు షిఫ్టుల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఏప్రిల్ 20, 22, 25, 27, 29, మే 2 తేదీల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 21, 23, 26, 28, 30, మే 5 తేదీల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో.. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష మార్చి 4న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మార్చి 6న నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉండగా.. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మారింది. థియరీ పరీక్షల కంటే ముందే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
TS Police: నేటి నుంచి పోలీసు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు.. 52వేల మంది హాజరు..!
తాజావార్తలు
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
-
Heatwave Workout Tips: వేసవిలో జిమ్ ప్రియులారా జాగ్రత్త..! ఈ తప్పులు చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..!
-
KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్పై భారీ విజయం.!
-
IPL 2026 ప్లేఆఫ్స్ ఖరారు.. రెండవసారి ఛాంపియన్ కాబోయే జట్టు ఏది.?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!