Kishan Reddy: ప్రపంచ పాల ఉత్పత్తిలో మనమే నెంబర్ వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో పాల ఉత్పత్తిలో దేశం నెంబర్ గా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డబ్బా ఇల్లు వద్దు అన్న తెలంగాణ ప్రభుత్వం.. 8 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్ని ఇళ్ళు కట్టినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధిని 21 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో వేశారని గుర్తు చేశారు.
దేశ జీడీపీ పెరిగింది..ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. పేద దేశాలకు ఆహార ధాన్యాలు పంపిస్తున్నామని గుర్తు చేశారు. సేంద్రియ వ్యవసాయం కోసం చర్యలు తీసుకుటోందని తెలిపారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ ల వినియోగం ప్రోత్సహిస్తున్నామన్నారు. ల్యాండ్ రికార్డ్ ల ఆధునీకరణ కోసం కేంద్రం ప్రత్యేక నిధులు విడుదల చేసిందన్నారు. వరి ధాన్యం కనీస మద్దతు ధర కేంద్రం 1940 రూపాయలకు పెంచిందని గుర్తు చేశారు.
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
తెలంగాణలో ధాన్యం సేకరణ కోసం 2014లో 3400 కోట్లు కొనుగోలు చేసేది.. ప్రస్తుతం 26,600 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చుచేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2014కు ముందు ఎరువుల కొరత, నాణ్యమైన విత్తనాలు దొరికేవి కావని, నానో యూరియా దిగుబడి పెంచుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మోడీ ప్రభుత్వం 23 రకాల పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్ని రోజులు ఫార్మ్ హౌస్ లో ఉంటారో.. ఎన్ని రోజులు ప్రగతి భవన్ లో ఉంటారో తెలియదని ఎద్దేవ చేశారు. మోడీ పాలనలో ఒక్క పేలుడు ఘటన కూడా జరగలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ బాంబు పేలుళ్ల ఘటనను గుర్తు చేస్తూ ఈవాఖ్యలు చేశారు.
Kuwait: నన్ను భారత్కు రప్పించండి.. చిత్రహింసలు పెడుతున్నారు
- Tags
- bjp
- kcr
- Kishan Reddy
- modi
- TRS
తాజావార్తలు
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!