Kuwait: నన్ను భారత్కు రప్పించండి.. చిత్రహింసలు పెడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇక్కడ చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకురాలేక.. దుబాయ్, కువైట్ వంటి ప్రాంతాలకు పెదవాళ్ళు వెళుతుంటారు. అనతి కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న ఆశతో, కుటుంబ సభ్యుల్ని వదిలేసి ఒంటరి పోరాటానికి బయలుదేరుతారు. దీన్నే అలుసుగా తీసుకొని, కొందరు ఏజెంట్లు నేలపై ఆకాశం చూపించేందుకు ప్రయత్నిస్తారు. అక్కడికెళ్ళాక ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా తాము చూసుకుంటామంటూ మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. పాపం.. వారి మాటలకు లొంగి, తమ జీవితాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళాక, ఏజెంట్లు తమ అసలు రూపాన్ని బయటపెడతారు. అలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతి జిల్లా ఎర్రివారిపాలెం మండలం పెద్దవడ్డిపల్లికి చెందిన శ్రావణి అనే మహిళ.. ఉపాధి కోసం గత నెలలో కువైట్కి వెళ్ళింది. అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా తాను జాగ్రత్తగా చూసుకుంటానని ఏజెంట్ చెంగల్రాజా ఆమె కుటుంబసభ్యుల్ని నమ్మించాడు. కువైట్లో ఉద్యోగం చేస్తే, తక్కువ సమయంలోనే భారీ డబ్బులు సంపాదించొచ్చని ఆశ చూపాడు. అతడు చెప్పిన మాటలు నమ్మి, ఆమె కువైట్కి వెళ్ళింది. ఒక నెల రోజుల వరకు అన్ని సవ్యంగానే సాగాయి. అయితే, ప్రస్తుత యజమాని తనని సరిగా చూసుకోవడం లేదని, మరో చోట పని ఇప్పించాలని ఆమె కోరింది. అందుకు సరేనన్న ఆ ఏజెంట్.. మరో చోట పని దొరికేలోపు తన ఆఫీసులోనే ఉండమని చెప్పాడు. అంతే, ఆమెని ఓ గదిలో బంధించి, వేధించడం మొదలుపెట్టాడు. మానసికంగానే కాదు.. లైంగికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. సమయానికి ఆహారం కూడా ఇవ్వడం లేదు.
Also Read
- NEET Controversy: "రాజీనామాతో నా కూతురు తిరిగి రాదు.. దోషులను ఉరి తీయండి".. నీట్ బాధితురాలి తల్లి ఆవేదన..
- Rajnath Singh: భారత్ డేటా సెంటర్లు నిర్మిస్తే.. పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది..
- Dharmendra Pradhan: షాకింగ్.. రెండు సార్లు రాజీనామా చేయడానికి ముందుకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కానీ..
- Rahul Gandhi: 'విద్యార్థులను చంపమని ఎవరు ఆదేశించారు?' అమిత్ షాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీవ్రమైన ప్రశ్నలు
దీంతో.. శ్రావణి సెల్ఫీ వీడియోలో తన వ్యధ చెప్పుకుంది. తనని వెంటనే భారత్కు రప్పించండని ఆ వీడియోలో కోరింది. ఏజెంట్ చెంగల్రాజా తనని పెడుతున్న చిత్రహింసల గురించి ఆ వీడియోలో వివరించింది. ఏజెంట్తో పాటు అతని పార్ట్నర్ కూడా తనని వేధిస్తున్నాడని భోరుమంది. నాలుగు రోజుల నుంచి సరిగ్గా ఆహారం తినలేదని, కేవలం నీళ్ళతోనే సాగిస్తున్నానని ఆమె విలపించింది. ఎలాగైనా భారత్కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని వేడుకుంది. ఇక్కడున్న శ్రావణి అత్త సైతం, ఏజెంట్ బాగా చూసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తన కోడల్ని రప్పించాలని కోరింది.
తాజావార్తలు
-
Ishan Kishan: బ్యాటింగ్లో విధ్వంసం, కీపింగ్లో మిస్టేక్.. ధోనీలా ట్రై చేసి ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్..
-
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
MG Comet EV: ఎంజీ కామెట్ EV కొనాలనుకుంటున్నారా? ధరలు పెంచిన కంపెనీ.. ఏ వేరియంట్పై ఎంత పెరిగిందంటే?
-
El Niño Impact: కొబ్బరిబొండాల పైనా ‘ఎల్నినో’ ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
ట్రెండింగ్
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..