Rain Alert: మాండూస్ ప్రభావం.. తెలంగాణలో మూడురోజులు వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert: మాండూస్ తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు చలి తీవ్రత పెరుగుతోందని వెల్లడించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత కాస్త తగ్గిన.. మెదక్ జిల్లా టెక్క్మాల్ లో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా హబ్సిపూర్ లో 18.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లా అల్మాయిపేటలో 18.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల వర్షం కురయడంతో.. కల్లాల్లో ధాన్యం తడిసింది, పత్తి పంటపై వానకు తడిసి ముద్దైంది. ఇక కొమురం భీం జిల్లా ఎల్కపల్లె లో 46.5 మీమీ వర్షపాతం నమోదుకాగా.. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి లో 22.8 మీమీ వర్షపాతం. ఆదిలాబాద్ జిల్లాలో 18.8 మీమీ వర్షపాతం నమోదు అయ్యింది.
Read also: RRR in Japan: యాబై రోజుల్లో మూడు దశాబ్దాల రజినీ రికార్డ్ కి ఎండ్ కార్డ్…
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ మండు తుపాను రైతులను కంటతడి పెట్టిస్తోంది. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు గత 20 రోజులుగా ధాన్యాన్ని రోడ్లపై పోసుకుని వాటి విక్రయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయదు, మిల్లర్లు కొనుగోలు చేయరు. ఏం చేయాలో తోచక.. రవాణా ఖర్చులు భరించలేక రోడ్లపైనే ధాన్యం కుప్పలు తెప్పలుగా పోసుకున్న రైతులు ఇప్పుడు మండు తుపానుతో కుప్పలు తెప్పలుగా పోశారు. భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. రోడ్లపైన, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయి ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Read also: Extramarital Affair: అత్తతో వివాహేతర సంబంధం.. పెళ్లి ఎలా చేసుకుంటావంటూ..
ఆదివారం గ్రేటర్లో తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ట ఉష్ణోగ్రత 26.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19.2 డిగ్రీలు, గాలిలో తేమ 78 శాతంగా నమోదైంది. రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉదయం పూట పొగమంచు కురుస్తుందని, తూర్పు, ఆగ్నేయం నుంచి చలిగాలులు వీస్తాయని చెప్పారు.13న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
Read also: Extramarital Affair: అత్తతో వివాహేతర సంబంధం.. పెళ్లి ఎలా చేసుకుంటావంటూ..
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!