IT Raids: మూడోరోజు ఐటీ రైడ్స్.. ఎంపీ ఇంట్లో ఆపి.. ఎమ్మెల్యేల ఇంట్లో సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల జనార్దన్ రెడ్డిల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ ఎస్ కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇళ్లలో ఐటీ అధికారులు ఈనెల 14వ తేదీ ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. భువనగరి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి నివాసంలో నిన్న ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిలిపివేశారు. అయితే భువనగిరి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
Read also: Adipurush: థియేటర్ లో హనుమంతుడి సీటుపై వర్మ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన వస్త్ర దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన ఇతర వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన ఐటీ అధికారులు.. ఈ కంపెనీల లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి కలిసి వ్యాపారం చేస్తున్నారు. మెయిన్ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీ ఈ ముగ్గురు భాగస్వాములను ప్రమోట్ చేస్తోంది. ఈ కంపెనీ పన్ను చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఐటీ సోదాలు జరిగే ప్రాంతాల్లో కేంద్ర బలగాలు బందోబస్తు ఏర్పాటు చేశాయి.
Mahabubnagar: మహబూబ్నగర్ కల్తీ కల్లు ఘటన.. నేడు హైకోర్టులో విచారణ
ఐటీ సోదాల తర్వాత కడిగిన ముత్యంలా బయటకు వస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిన్న ప్రకటించారు. ఆయన ఇప్పటికే ఐటీ శాఖకు రూ. 150 కోట్లు పన్నులు చెల్లించామని మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. మేము ఐటి అధికారులకు సహకరిస్తున్నామన్నారు. మా సిబ్బంది కూడా సహకరిస్తున్నారని తెలిపారు. అయినా ఐటి అధికారులు మా సిబ్బందిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని చోట్ల మాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము కూడా అలాగే చేస్తామన్నారు. సోదాలు ముగిసిన తరువాత వారి సంగతి చూస్తామని హెచ్చారించారు.
మా దగ్గర సెల్ ఫోన్ లు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటు కదల నివ్వడం లేదని మండిపడ్డారు. వ్యాపారం చేస్తున్నప్పుడు ఐటి వాళ్ళు వస్తారు.. చెక్ చేసుకుంటారని అన్నారు. మేము చెప్పేది చెబుతాం వాళ్ళు అడిగేది అడుగుతారని స్పష్టం చేశారు. నా లెక్కలు కడిగిన ముత్యంలా ఉంటుందని అన్నారు. ఎన్ని రోజులు జరిగిన సహరిస్తామన్నారు. మోదీ ది కొత్త రాజ్యాంగామా..? వ్యాపారం చేయోద్దా..? భూములు కొనడం తప్పా? అంటూ ప్రశ్నించారు. ఐటి అధికారులు నాకు అవార్డ్ ఇచ్చి వెళ్తున్నారని అన్నారు. 150 కోట్లు ట్యాక్స్ కట్టానని తెలిపారు. మా ఉద్యోగులను కొడుతున్నారని తెలుస్తుందని, తరువాత వాళ్ళ పని చూస్తా అని మండిపడ్డారు. తప్పు చేసే డబ్బులు కట్టించుకోవాలని అన్నారు. పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తా అని స్పష్టం చేశారు.
Mahabubnagar: మహబూబ్నగర్ కల్తీ కల్లు ఘటన.. నేడు హైకోర్టులో విచారణ
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!