HYDRA : నగరం నలువైపులా హైడ్రా ఆపరేషన్స్.. భారీగా ఆక్రమణల తొలగింపు
- హైదరాబాద్ నలువైపులా హైడ్రా ఆపరేషన్స్
- భారీగా ఆక్రమణల తొలగింపు
- మంచిరేవుల నాగిరెడ్డి కుంటచెరువు దగ్గర కబ్జాలు తొలగించిన హైడ్రా
- రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలపై హైడ్రా చర్యలు
- స్థానికుల ఫిర్యాదుతో వెంటనే స్పందించిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరంలో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్న వారిపై హైడ్రా (Hyderabad Disaster Response and Assets Protection Agency) తన పోరాటాన్ని ముమ్మరం చేసింది. ప్రజల ఫిర్యాదుల మేరకు స్పందిస్తూ, రియల్ ఎస్టేట్ మాఫియా , అక్రమ కట్టడాల నుంచి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది. రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల నాగిరెడ్డి కుంట చెరువు వద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న భారీ అక్రమాలను హైడ్రా అడ్డుకుంది. చెరువు ఉనికిని మాయం చేసేందుకు చుట్టూ టిన్ షీట్లు కప్పి లోపల కబ్జా చేసే ప్రయత్నాన్ని అధికారులు భగ్నం చేశారు. అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించి, చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ఇది ప్రభుత్వానికి చెందిన చెరువు స్థలం అని తెలియజేస్తూ హైడ్రా బోర్డులను ప్రతిష్టించారు.
పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కారణమవుతున్న గండిమైసమ్మ–మియాపూర్ ప్రధాన రహదారిపై హైడ్రా కీలక చర్యలు తీసుకుంది. 150 ఫీట్ల వెడల్పు ఉండాల్సిన ఈ రహదారిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన 10 షాపులను అధికారులు కూల్చివేశారు. ఈ ఆక్రమణల వల్ల వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. అయితే, ఈ కూల్చివేతలు ఆకస్మికంగా కాకుండా, రెండు నెలల ముందే నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారమే నిర్వహించినట్లు హైడ్రా వెల్లడించింది. దీనితో ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించింది.
Tollywood: టాలీవుడ్కు ‘డ్రగ్’ షాక్.. 90 రోజులకోసారి టెస్ట్.. నెగటివ్ వస్తేనే సినిమా రిలీజ్?
ఘటకేసర్ పరిధిలోని అవుషాపూర్లో 1440 గజాల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా రక్షించింది. ఒక లేఅవుట్లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమార్కులు ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న హైడ్రా బృందం వెంటనే రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించింది. ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి, ఇది ప్రభుత్వ పార్కు స్థలమని బోర్డులు ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!