BJP Leader Kolanu Shankar: బాలాపూర్ లడ్డూను ప్రధాని మోడీకి అందిస్తాం..
- బాలపుర్గణేష్ లడ్డూలు రావడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి..
- వేలంలో లభించిన లడ్డూను ప్రధాని నరేంద్ర మోడీకి బహూకరిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader Kolanu Shankar: వేలంలో బాలపుర్గణేష్ లడ్డూలు రావడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి అన్నారు. వేలంలో లభించిన లడ్డూను ప్రధాని నరేంద్ర మోడీకి బహూకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎలాగైనా లడ్డూను దక్కించుకోవాలని వేలంలో పాల్గొన్నానని తెలిపారు. అదృష్టవశాత్తూ 2024లో రూ.30,01,000లకు సొంతం చేసుకున్నట్లు కొలను శంకర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో 31వ సారి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో కొలను శంకర్ రెడ్డి విజేతల జాబితాలో చేరారు. బాలాపూర్ లడ్డూను 2024లో రూ.30,01,000లకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకోవడంతో వేలం పాట చరిత్రలో బాలాపూర్ లడ్డూ ఏడు రికార్డులను బద్దలు కొట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ తీగల హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read also: Balapur Ganesh Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతంటే..?
Also Read
- CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
- KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
- Shubhakshetra Fraud: శుభాక్షేత్ర మోసం.. మరో కీలక నిందితుడు అరెస్ట్.!
- Minister Seethakka : ఎల్ నీనో ఎఫెక్ట్పై సీతక్క అలర్ట్.. తెలంగాణలో తాగునీటి కొరతకు నో ఛాన్స్
బాలాపూర్ లడ్డూ వేలం పోరుగా కొనసాగింది. వేలం రూ.1016తో ప్రారంభమైంది. 44 వసంతాల గణేష్ వార్షికోత్సవాల్లో భాగంగా గత 30 ఏళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి గడచిన 30 ఏళ్లలో లడ్డూ వెలం పాటలో 1,82,51,950 కోట్ల రూపాయలు ఉండగా, అందులో 1,58,07,970 కోట్ల రూపాయలతో బాలాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ గతేడాది 2023లో జరిగిన వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకున్న దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షల నగదును గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డికి అందజేశారు. నగదు బహూకరించిన దాసరి దయానంద్ రెడ్డికి గణేష్ ఉత్సవ సమితి తరపున లక్ష రూపాయల విలువైన బంగారు గొలుసును అందజేశారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి నిమజ్జన పూజలు ప్రారంభమయ్యాయి.
Big Breaking: ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన..
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!