BJP Leader Kolanu Shankar: బాలాపూర్ లడ్డూను ప్రధాని మోడీకి అందిస్తాం..
- బాలపుర్గణేష్ లడ్డూలు రావడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి..
- వేలంలో లభించిన లడ్డూను ప్రధాని నరేంద్ర మోడీకి బహూకరిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader Kolanu Shankar: వేలంలో బాలపుర్గణేష్ లడ్డూలు రావడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి అన్నారు. వేలంలో లభించిన లడ్డూను ప్రధాని నరేంద్ర మోడీకి బహూకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎలాగైనా లడ్డూను దక్కించుకోవాలని వేలంలో పాల్గొన్నానని తెలిపారు. అదృష్టవశాత్తూ 2024లో రూ.30,01,000లకు సొంతం చేసుకున్నట్లు కొలను శంకర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో 31వ సారి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో కొలను శంకర్ రెడ్డి విజేతల జాబితాలో చేరారు. బాలాపూర్ లడ్డూను 2024లో రూ.30,01,000లకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకోవడంతో వేలం పాట చరిత్రలో బాలాపూర్ లడ్డూ ఏడు రికార్డులను బద్దలు కొట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ తీగల హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read also: Balapur Ganesh Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతంటే..?
Also Read
- HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
- Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
బాలాపూర్ లడ్డూ వేలం పోరుగా కొనసాగింది. వేలం రూ.1016తో ప్రారంభమైంది. 44 వసంతాల గణేష్ వార్షికోత్సవాల్లో భాగంగా గత 30 ఏళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి గడచిన 30 ఏళ్లలో లడ్డూ వెలం పాటలో 1,82,51,950 కోట్ల రూపాయలు ఉండగా, అందులో 1,58,07,970 కోట్ల రూపాయలతో బాలాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ గతేడాది 2023లో జరిగిన వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకున్న దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షల నగదును గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డికి అందజేశారు. నగదు బహూకరించిన దాసరి దయానంద్ రెడ్డికి గణేష్ ఉత్సవ సమితి తరపున లక్ష రూపాయల విలువైన బంగారు గొలుసును అందజేశారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి నిమజ్జన పూజలు ప్రారంభమయ్యాయి.
Big Breaking: ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన..
తాజావార్తలు
-
RCB vs GT Qualifier 1: బెంగళూరు vs గుజరాత్ మెగా సమరం.. పిచ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
-
Suriya 50: ‘కరుప్పు’ హిట్ జోష్లో సూర్య.. 50వ సినిమాకు భారీ ప్లాన్!
-
Ananya Panday: అనన్య పాండేపై నెటిజన్ల ఫైర్!
-
CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
-
US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?