Jupally Krishna Rao: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికకు పరిచయం చేశాం..
- క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది..
- నూతన క్రీడా విధానంపై సీఎం రేవంత్ ప్రత్యేక ప్రణాళికలు..
- తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికకు పరిచయం చేశాం: మంత్రి జూపల్లి
Jupally Krishna Rao: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ సుందరీమణులతో నిర్వహించిన స్పోర్ట్స్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఒకప్పుడు క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉండేది.. కానీ ఇప్పుడు ప్రాతినిధ్యం స్థాయి నుంచి పతకాలు అందించే స్థాయికి ఎదిగారని అన్నారు. పురుషులతో సమానంగా క్రీడల్లో పోటీ పడుతూ, ప్రజాదరణ పొందుతున్నారని తెలిపారు. శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు మానసిక స్థైర్యం పెరుగుతుంది.. అది మనం ఏదైనా సాధించేలా చేస్తుందన్నారు మంత్రి జూపల్లి.
Read Also: India Armenia: ఆర్మేనియాకు భారత “ఆకాష్ మిస్సైల్స్” .. టర్కీ, అజర్బైజాన్కి మూడింది..
Also Read
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నూతన క్రీడా విధానంపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ చొరవ మహిళల సాధికారతకు దారితీస్తుంది.. పిల్లలు క్రీడలను వృత్తిగా ఎంచుకునేలా ప్రోత్సహిస్తుందని కృష్ణారావు పేర్కొన్నారు.
Read Also: Thug life : కమల్ హాసన్ ’థగ్ లైఫ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..
మరోవైపు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికకు పరిచయం చేయడం జరిగిందని మంత్రి జూపల్లి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేశాం.. అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త ప్రదేశాలను సందర్శించడం కేవలం విలాసం, విశ్రాంతి సాధనం కాదు.. మరో సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం అన్నారు. అలాగే, కొత్త వంటకాలను రుచి చూడటం, ఈ జ్ఞాపకాలను పదిలంగా గుర్తుంచుకోవడానికి పర్యాటకం దోహదపడుతుందని చెప్పారు. పర్యాటకం అనేది ప్రజల మధ్య బంధాలను నిర్మించే వంతెన లాంటిదని మంత్రి జూపల్లి తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో