VC Sajjanar: ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
- ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
- రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాల పరిష్కారం..
- ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉంది: టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar: హైదరాబాద్ నగరంలోని బాగ్లింగంపల్లిలో గల టీజీఎస్ఆర్టీసీ కళా భవన్లో రాష్ట్రస్థాయి ఎంప్లాయ్ వెల్పేర్ బోర్డు సభ్యులతో ఆర్టీసీ యాజమాన్యం ఈరోజు సమావేశమైంది. ఈ మీటింగ్ కు సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆయన వెల్పేర్ బోర్డు సభ్యుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి మరి తెలుసుకున్నారు.
Read Also: Monsoon: జూన్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు: ఐఎండీ..
Also Read
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
ఇక, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. నిబద్దతతో పని చేస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోంది అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లింపు, 21 శాతం ఫిట్మెంట్ తో 2017 పీఆర్సీ, 2013 ఆర్పీఎస్ బాండ్ల డబ్బుల విడుదలతో పాటు పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని గుర్తు చేశారు. విధి నిర్వహణలో మరణించిన 2,350 మంది సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలను కల్పించామన్నారు. మెడికల్ అన్ ఫిట్ అయిన మరో 537 మందికి ఉద్యోగాలు ఇచ్చామని వీసీ సజ్జనార్ వెల్లడించారు.
Read Also: Manchu Brothers: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనుక ‘చరిత’.. ఆమెకు మనోజ్ థాంక్స్?
అయితే, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రతి ఉద్యోగికి టెస్టులు చేశామని టీజీఎస్ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఆరోగ్య టెస్టుల ఫలితంగా 726 మంది ఉద్యోగులకు, 184 మంది ఉద్యోగుల జీవిత భాగస్వామ్యులను ప్రాణాప్రాయం నుంచి సంస్థ కాపాడిందన్నారు. అలాగే, మహాలక్ష్మి పథకం అమలుతో సిబ్బందిలో పెరిగిన పని భారాన్ని తగ్గించేందుకు తాత్కాలికంగా డ్రైవర్, కండక్టర్ పోస్టులకు నియామకాలు చేపడుతుంటే.. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీలో 3036 రెగ్యూలర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని.. సాంకేతిక కారణాల వల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఆ నియమాకాలు కచ్చితంగా జరుగుతాయి.. అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. తమ మనుగడ కోసం ఐదారు నెలలుగా కొందరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నా.. ఉద్యోగులు ఎంతో సమయమనంతో ఉన్నారని వీసీ సజ్జనార్ చెప్పారు.
Read Also: Ghaziabad: ఈ పిల్లలున్నారే.. కోతి చేష్టలు చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు.. చివరకు
అలాగే, ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ కొనుగోలు చేసేలా అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని వీసీ సజ్జనార్ చెప్పుకొచ్చారు. యాజమాన్యం తీసుకునే నిర్ణయాల వెనుక ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలే ఉంటాయో తప్ప.. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవన్నారు. ప్రతి నిర్ణయం చాలా పారదర్శకంగా, సంస్థ నియమ నిబంధనలకు లోబడే ఉంటుంది.. యాజమాన్యానికి, సిబ్బందికి వెల్పేర్ బోర్డు సభ్యులు అనుసంధానకర్తల్లాగా పని చేయాలని సూచించారు. ప్రతి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి స్వేచ్ఛగా తీసుకురావాలి అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..