VC Sajjanar Tweet: వెర్రి చేష్టలు అవసరమా!? ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ వైరల్..
- ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ వైరల్..
- సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar Tweet: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు ఇష్టానుసారంగా రీళ్లు చేస్తున్నారు. ఓ యువకుడు వ్యూస్ కోసం వెకిరి చేష్టలు చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు ఫాలో అవుతున్న వ్యక్తి కోరిక మేరకు ఆ యువకుడు సవాలు చేశాడు. ఆ సవాల్ ఏంటంటే.. ఆర్టీసీ బస్సును నడిరోడ్డుపై ఆపి బస్సులో ఎక్కి ఆతరువాత కిందికి దిగి పారిపోవాలని యూజర్ కోరాడు. ఆ యువకుడు సరే అలాగే డేర్ చేస్తా అంటూ సవాల్ విసిరారు. అతను రోడ్డు మీదకు వెళ్ళాడు. అప్పుడే APSRTC పల్లె వెలుగు బస్సు వచ్చింది. బస్సును ఆపడానికి అతను చేయి ఊపాడు. దీంతో సదరు వ్యక్తి బస్సు ఎక్కుతాడని భావించిన బస్సు డ్రైవర్ బస్సును ఆపాడు.
Read also:Khairatabad Ganesh 2024: గంట గంటకూ పెరుగుతున్న ఖైరతాబాద్ గణేష్ భక్తుల రద్దీ..
Also Read
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
అయితే ఆ యువకుడు ఆ బస్సును ఎక్కి అటు ఇటు చూసుకుంటూ బస్సు కదులుతున్నా పట్టించుకోకుండా.. కిందకు దిగి వెనక్కి పరుగెత్తాడు. ఈ తతంగమంతా వీడియో తీసి.. తన ఇస్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత సవాల్ చేసి గెలిచానని చెప్పాడు. ఆ తరువాత నన్ను ఫాలో అవ్వండి అంటూ ట్యాగ్ లైన్ చెప్పి వీడియో ముగించాడు. ఈ వీడియోను చూసి స్పందించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!? ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందనే సోయి కూడా లేకుండా కొందరు ఈ వికృత చేస్టలు చేస్తూ ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. లైక్లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు చేయడం మానుకోండని సలహా ఇచ్చారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి అని ఏపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మరి దీనిపై ఏపీ పోలీసులు ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నార్థకంగా మారింది.
Kishan Reddy: మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి..
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!