Kishan Reddy: మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి..
- రాష్ట్ర ప్రభుత్వ నుండి నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో నిధులు అందిస్తాం..
- కేంద్ర హోశాఖ తో మాట్లాడి ఎస్డిఎఫ్ నిధులు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటా..
- అదనపు డిజాస్టర్ నిధులు విడుదలయ్యేలా చూస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఖమ్మం జిల్లా దంచాలపురంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరద ముంపు ప్రాంతాలు పర్యటించి.. బాధితులను పరామర్శించారు. స్వయంగా తానే ముంపు బారిన పడ్డ ఇండ్లను పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానింపారు. ఖమ్మం ధంసలాపురంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వరద బాధితులకు నిత్యవసర వస్తువులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మంలో ఎన్నడూ లేని విధంగా వరదలు సంభవించాయని అన్నారు. ఈ వరదల్లో ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారని కేంద్రమంత్రి అన్నారు.
Read also: Hydra: హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా..
Also Read
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
మున్నేరు వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం పరివాహక ప్రాంతాన్ని వాగు పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అగ్రహారం కాలనీ వద్ద ఉన్న కందగడ్ల ఫంక్షన్ హాల్ లో మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల కోసం పనిచేస్తాయని ఆయన అన్నారు. వరదలు సంభవించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వరదలపై ఆరా తీశారని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వద్ద అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ కింద 1345 కోట్లు నిల్వ ఉంచారని వాటిని ప్రజలు కోసం ఖర్చు చేయమని మోదీ ఆదేశించారాని తెలిపారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ రాష్ట్రాల వద్ద ఉంచాలని తీర్మానం చేసిందన్నారు.
Read also: Murali Mohan: హైడ్రా అవసరం లేదు.. మేమే కూల్చేస్తాం.. నోటీసులపై మురళీమోహన్..
మున్నేరు వరద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు అండగా ఉంటాయని అన్నారు. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందని, వరద బాధితులు కష్టాల్లో ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వరద బాధితులను తప్పకుండా ఆదుకుంటుందన్నారు. క్షణాల్లో వచ్చిన భారీ వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని తెలిపారు. స్టేట్ డిజాస్టర్ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం. కలిసికట్టుగా అందరూ నడవాలన్నారు. మరోసారి తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ తరఫున వరద బాధితులకు తాత్కాలికంగా నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి సామాజిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలన్నారు.
Read also: Karimnagar: అసలే కోతులు.. కంగారు పెట్టి చివరకు నవ్వించిన ఘటన..
రాష్ట్ర ప్రభుత్వ నుండి నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో నిధులు అందిస్తామన్నారు. SDF నిధులను గత ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోలేదు.. యుటిలైజేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర హోశాఖ తో మాట్లాడి ఎస్డిఎఫ్ నిధులు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు డిజాస్టర్ నిధులు విడుదలయ్యేలా చూస్తామన్నారు. కేంద్రానికి ఆన్ని రాష్ట్రాలు సమానమే అని.. వరద సహాయ నిధుల విషయంలో రాష్ట్రాల పట్ల వివక్ష లేదన్నారు. రాష్ట్రంలో వరదపై కేంద్రం స్పందిస్తున్న తీరుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పకుండా.. వాస్తవాన్ని కేంద్రానికి నివేదించిన్నామని తెలిపారు. విపత్తు సమయంలో కూడా విపక్షాలు రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు.
Tirupati Laddu: టీటీడీ అన్ని ఆలయాల్లో తిరుపతి లడ్డూలు.. హైదరాబాద్లో ఎక్కడంటే..
తాజావార్తలు
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?