Kishan Reddy: హైదరాబాద్ లో పండుగ వాతావరణం.. భక్తి శ్రద్ధలతో ఏటా బోనాల పండుగ..
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు..
- బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బోనాల ఉత్సవాల సందర్భంగా అంబర్ పేటలోని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. భాగ్యనగరంతోపాటు తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో జరిగే గొప్ప వేడుక బోనాల పండుగ. ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, విషజ్వరాలు రాకూడదని, మంచి వర్షాలతో, పాడి పంటలతో అందరూ కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకునే పండుగ ఈ బోనాలు అన్నారు. ఇది ముఖ్యంగా మహిళల పండుగ. ధనిక, పేద అనే తేడా లేకుండా.. అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి బోనం చేసి దేవాలయాల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఈరోజు ఏ ఇంటికి వెళ్లినా, ఏ గుడికి వెళ్లినా పండుగ వాతావరణం కనిపిస్తుంది అని తెలిపారు.
Read also: Bhadrachalam: గోదావరికి వరదలు.. గోదావరిలోకి భక్తులను అనుమతించని పోలీసులు..
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
అన్ని వర్గాల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఏటా బోనాల పండుగ చేసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ ప్రజలకు గానీ, హైదరాబాద్ ప్రజలకు గానీ, తెలంగాణ ప్రజలకు గానీ నా తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. బోనాలు ప్రకృతిని పూజించే పండుగ అన్నారు. మనం అందరం కూడా ప్రకృతిని పరిరక్షించుకోవాలి.. శక్తిని పూజించుకోవాలని తెలిపారు. దేశాన్ని శక్తిమంతంగా తయారు చేసుకోవడంలో అమ్మవారి ఆశీస్సులు ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలపై ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అంబర్ పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో అనేక సంవత్సరాలుగా అద్భుతంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ బోనాల పండుగను వారం పది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. గ్రామాల్లో ఏ రకంగా అంతా కలిసి ఉంటారో.. అంబర్ పేటలో కూడా అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉంటూ పండుగా చేస్తారని అన్నారు. ఈ బోనాల పండుగ సందర్భంగా అంబర్ పేట.. ఈ చుట్టు పక్కల ఉన్న ప్రజలు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుంటారు. దేవాలయ కమిటీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అద్భుతంగా ఏర్పాట్లు చేసిందని కిషన్ రెడ్డి అన్నారు.
Srisailam Project: శ్రీశైలం డ్యామ్కు భారీగా వరద.. రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం..
తాజావార్తలు
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్గా ఎలా మారింది?
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..