Kishan Reddy: హైదరాబాద్ లో పండుగ వాతావరణం.. భక్తి శ్రద్ధలతో ఏటా బోనాల పండుగ..
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు..
- బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ..
Kishan Reddy: బోనాల ఉత్సవాల సందర్భంగా అంబర్ పేటలోని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. భాగ్యనగరంతోపాటు తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో జరిగే గొప్ప వేడుక బోనాల పండుగ. ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, విషజ్వరాలు రాకూడదని, మంచి వర్షాలతో, పాడి పంటలతో అందరూ కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకునే పండుగ ఈ బోనాలు అన్నారు. ఇది ముఖ్యంగా మహిళల పండుగ. ధనిక, పేద అనే తేడా లేకుండా.. అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి బోనం చేసి దేవాలయాల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఈరోజు ఏ ఇంటికి వెళ్లినా, ఏ గుడికి వెళ్లినా పండుగ వాతావరణం కనిపిస్తుంది అని తెలిపారు.
Read also: Bhadrachalam: గోదావరికి వరదలు.. గోదావరిలోకి భక్తులను అనుమతించని పోలీసులు..
Also Read
అన్ని వర్గాల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఏటా బోనాల పండుగ చేసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ ప్రజలకు గానీ, హైదరాబాద్ ప్రజలకు గానీ, తెలంగాణ ప్రజలకు గానీ నా తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. బోనాలు ప్రకృతిని పూజించే పండుగ అన్నారు. మనం అందరం కూడా ప్రకృతిని పరిరక్షించుకోవాలి.. శక్తిని పూజించుకోవాలని తెలిపారు. దేశాన్ని శక్తిమంతంగా తయారు చేసుకోవడంలో అమ్మవారి ఆశీస్సులు ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలపై ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అంబర్ పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో అనేక సంవత్సరాలుగా అద్భుతంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ బోనాల పండుగను వారం పది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. గ్రామాల్లో ఏ రకంగా అంతా కలిసి ఉంటారో.. అంబర్ పేటలో కూడా అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉంటూ పండుగా చేస్తారని అన్నారు. ఈ బోనాల పండుగ సందర్భంగా అంబర్ పేట.. ఈ చుట్టు పక్కల ఉన్న ప్రజలు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుంటారు. దేవాలయ కమిటీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అద్భుతంగా ఏర్పాట్లు చేసిందని కిషన్ రెడ్డి అన్నారు.
Srisailam Project: శ్రీశైలం డ్యామ్కు భారీగా వరద.. రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం..
తాజావార్తలు
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో