Secunderabad: బన్సీలాల్పేటలో విషాదం. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్: సమాజంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడి బాధిత కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. భర్త కొట్టాడని, అత్తింటి వేధింపులు తాళలేక, ఆర్ధిక ఇబ్బందులు ఇలా అనేక కారణాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తల్లిదండ్రులు చేసే తప్పులకు అభంశుభం తెలియని చిన్నారులు కూడా పసిప్రాయంలోనే పాడెక్కుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది.
Read Also: The Kerala Story : సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసా…?
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఈ ఘటన జరిగింది. కుమారుడు, కూతురిని భవనం 8వ అంతస్తు నుంచి కిందపడేసిన అనంతరం.. తల్లి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కవలలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: No Broker: ‘నో బ్రోకర్’ పెట్టిన చిచ్చు.. కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
మరోవైపు ఘటన స్థలానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. ఈ ఘటనపై స్థానికులను కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆత్మహత్యకు కారణాలేంటంటే.. భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవని.. అంతేకాకుండా డబుల్ బెడ్ రూం తన పేరు మీద రాయాలి అని భార్యను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా యాదాద్రిలో భార్య పేరు మీద ఉన్న ల్యాండ్ ని కూడా తన పేరు మీద రాయాలని భర్త గణేష్ వేధించేవాడు. పెళ్లి అయిన తర్వాత.. లావుగా అయ్యావని.. అందంగా లేవని.. తరూచూ భర్త గొడవపడేవాడని స్థానికులు అంటున్నారు. పెళ్లి జరిగిన సమయంలో రూ.2 లక్షల కట్నం ఇచ్చినట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. యాదాద్రి వద్ద ఉన్న ల్యాండ్ కూడా గణేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లు వారు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!