Secunderabad: బన్సీలాల్పేటలో విషాదం. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్: సమాజంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడి బాధిత కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. భర్త కొట్టాడని, అత్తింటి వేధింపులు తాళలేక, ఆర్ధిక ఇబ్బందులు ఇలా అనేక కారణాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తల్లిదండ్రులు చేసే తప్పులకు అభంశుభం తెలియని చిన్నారులు కూడా పసిప్రాయంలోనే పాడెక్కుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది.
Read Also: The Kerala Story : సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసా…?
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఈ ఘటన జరిగింది. కుమారుడు, కూతురిని భవనం 8వ అంతస్తు నుంచి కిందపడేసిన అనంతరం.. తల్లి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కవలలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: No Broker: ‘నో బ్రోకర్’ పెట్టిన చిచ్చు.. కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
మరోవైపు ఘటన స్థలానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. ఈ ఘటనపై స్థానికులను కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆత్మహత్యకు కారణాలేంటంటే.. భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవని.. అంతేకాకుండా డబుల్ బెడ్ రూం తన పేరు మీద రాయాలి అని భార్యను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా యాదాద్రిలో భార్య పేరు మీద ఉన్న ల్యాండ్ ని కూడా తన పేరు మీద రాయాలని భర్త గణేష్ వేధించేవాడు. పెళ్లి అయిన తర్వాత.. లావుగా అయ్యావని.. అందంగా లేవని.. తరూచూ భర్త గొడవపడేవాడని స్థానికులు అంటున్నారు. పెళ్లి జరిగిన సమయంలో రూ.2 లక్షల కట్నం ఇచ్చినట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. యాదాద్రి వద్ద ఉన్న ల్యాండ్ కూడా గణేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లు వారు తెలిపారు.
తాజావార్తలు
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
-
Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
-
Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
-
IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్కు భారీ షాక్?
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!