Tirupati Laddu: టీటీడీ అన్ని ఆలయాల్లో తిరుపతి లడ్డూలు.. హైదరాబాద్లో ఎక్కడంటే..
- హైదరాబాద్లోని తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త ..
- ప్రతిరోజూ హిమాయత్నగర్- జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో లడ్డూ ప్రసాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Laddu: హైదరాబాద్లోని తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి హైదరాబాద్ నగరంలో కూడా తిరుమల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. భాగ్యనగరంలో భక్తులందరికీ లడ్డూలు అందుబాటులో ఉంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా వారానికి ఒకసారి మాత్రమే లభించే తిరుపతి లడ్డూను ఇకపై అన్ని రోజులూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని హిమాయత్నగర్ టీటీడీ ఆలయ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, నిరంజన్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని భక్తులకు ఇక నుంచి ప్రతిరోజు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు తెలిపారు. హిమాయత్నగర్, జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది.
Read also: HYDRA: హైదరాబాద్ లో హైడ్రా దూకుడు.. జయభేరి కన్స్ట్రక్షన్స్కు నోటీసులు..
Also Read
- Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
- Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
ఈ లడ్డూ ప్రసాదం రూ.50కే అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూల విక్రయాలు జరిగేవి. ఇక నుంచి ప్రతిరోజూ భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇక మరోవైపు తిరుమల శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ రుచి, వాసన, నాణ్యత పెరగనుంది. తిరుమల శ్రీవారి భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు టీటీడీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. లడ్డూ ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు కర్ణాటక ప్రభుత్వ నందిని నెయ్యి వినియోగాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇటీవల తిరుమలలో భక్తులకు నిత్యం మూడున్నర లక్షల లడ్డూలను ప్రసాదంగా అందజేస్తున్న టీటీడీ తాజాగా లడ్డూ ప్రసాదం నాణ్యతను పరిశీలించి ప్రమాణాలు పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Bhatti Vikramarka: వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అర్ధరాత్రి 1 గంట వరకు బాధితులతో భట్టి ముఖాముఖి
తాజావార్తలు
-
Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
-
Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
-
Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?