Supreme Court: రామ మందిర విరాళాల చోరీ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- రామ మందిర విరాళాల కేసులో కొత్త SIT ఏర్పాటు
- చార్టర్డ్ అకౌంటెంట్ను సభ్యుడిగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
- ఐజీ కిరణ్ ఎస్. నేతృత్వంలో దర్యాప్తు
- రెండు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ముందు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తన వాదనల్ని వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పారదర్శకమైన దర్యాప్తు జరిగేలా చూసేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలియజేశారు.
ఇదిలా ఉంటే, సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఫోరెన్సిక్ ఆడిట్లో అనుభవం ఉన్న చార్టర్ట్ అకౌంటెంట్ను సభ్యులుగా చేర్చిన కొత్త సిట్ ఏర్పాటు చేయాలని యూపీ సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కొత్త సిట్కు లక్నో రేంజ్ ఐజీ కిరణ్ ఎస్. నేతృత్వం వహించనున్నారు. సభ్యులుగా అయోధ్య రేంజ్ డీఐజీ సోమెన్ బర్మా, అయోధ్య ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ ఉన్నారు. కోర్టు సూచన మేరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిపుణుడైన చార్టర్డ్ అకౌంటెంట్ను కూడా సిట్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉన్నందున ఆర్థిక అంశాలను పరిశీలించేందుకు నిపుణులు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా పిటిషన్ల తరుపు న్యాయవాది, ఆలయానికి వచ్చే నిధులు, విరాళాల వివరాలను ట్రస్ట్ వెబ్ సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. అయితే, ఈ అంశాన్ని అనవసరంగా సంచలనంగా మార్చొద్దని సొలిసిటర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తుపై రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సిట్ను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
-
Vivo T5 5G: భారత్ లో త్వరలో విడుదల కానున్న వివో టి5 5జి.. 3డి కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ ఫీచర్స్
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!