Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
- E20 డీప్ఫేక్లపై మెటా, ఎక్స్, గూగుల్పై గడ్కరీ దావా.
- సివిల్ సూట్కు బాంబే హైకోర్టు అనుమతి.
- E20 విధానంతో తనకు సంబంధం లేదని గడ్కరీ స్పష్టీకరణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: ఇథనాల్ బ్లెండెడ్ E20 పెట్రోల్పై తనను, తన కుటుంబాన్ని తప్పుడు ఆరోపణలతో లింక్ చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, అసత్య పోస్టులు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వేదికపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సివిల్ పరువు నష్టం దావా వేయనున్నారు. ఇందుకు బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. మెటా ఆధీనంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (X), గూగుల్తో పాటు ఈ కంటెంట్ను ప్రచారం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు, పేజీలను కూడా ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చనున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY), టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT)లను కూడా ప్రతివాదులుగా చేర్చారు.
గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, E20 పెట్రోల్ నిర్ణయం ద్వారా తాను, తన కుటుంబం లాభపడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీడియోలు, ఎడిట్ చేసిన క్లిప్లు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఇవన్నీ అసత్యమని, దురుద్దేశపూర్వకంగా తన ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ఇలా చేస్తు్న్నారని ఆరోపించారు.
Also Read
- PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
- CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
- AAP: ఆప్కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
- Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్గాంధీతో ప్రేమ ముచ్చట్లు
దీంతో పాటు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్, E20 విధానం అమలు, రూపకల్పన, నిర్వహణ మొత్త కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందని, తన రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖతో దీనికి ఎలాంటి సంబంధం లేదని గడ్కరీ స్పష్టం చేశారు. డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ కంటెంట్, అబద్దపు ప్రచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని గడ్కరీ కోర్టును కోరారు. దీంతో బాంబే హైకోర్టు సివిల్ సూట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
నీట్ పేపర్ లీకేజ్ వివాదంలో యువత ఆందోళన కారణంగా విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ వివాదం ముగిసిన తర్వాత, ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు గడ్కరీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తామని, ఆయన రాజీనామాను కోరుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత గడ్కరీనే రాజీనామాకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గడ్కరీ వేసిన పరువు నష్టం దావా చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
-
Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్లిఫ్ట్ 2026 వచ్చేసింది.. 360° కెమెరా, రియర్ సీట్ మసాజ్తో అదిరిపోయే ఫీచర్లు
-
IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
-
Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
-
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!