Ekadasi 2024: ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. తొలి ఏకాదశి సందర్భంగా సందడి..
- రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ..
- తొలి ఏకాదశి- మొహరం ఒకే రోజు రావడంతో పూజలు- ప్రార్థనలు..
Ekadasi 2024: రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. తొలి ఏకాదశి, మొహరం ఒకే రోజు కావడంతో భక్తులు పూజలు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే ఆలయాల వద్ద క్యూలు కట్టారు. యాదగిరిగుట్ట, బాసర, శ్రీశైలం, వేములవాడ, భద్రాచలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొందరు ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలు చేస్తున్నారని తెలిపారు. వర్షం కారణంగా కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
Read also: Viral Photo: ఒకే ఫ్రేమ్లో మూడు ఇండస్ట్రీల స్టార్ హీరోలు.. ఫొటో వైరల్!
Also Read
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. ఆలయ అర్చకులు శ్రీ స్వామివారికి మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు, పరివార దేవతార్చనలు నిర్వహించి కల్యాణ మండపంలో 24 గంటల పాటు అఖండ భజన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, అధికారులు కాలినడకన గోదావరి నదిలో త్రివేణి సంగమం వద్దకు చేరుకుని కుండలలో గోదావరి జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజాము నుంచే వర్షంలోనే కాళేశ్వరం చేరుకుని పవిత్ర త్రివేణి సంగమం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శుభానంద దేవి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
Read also: Islamic Calendar: ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నుంచి కొత్త సంవత్సరం..
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భారీ వర్షాల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న శ్రీవారిని 87 వేల మందికి పైగా దర్శించుకున్నారు. 4 కోట్ల 53 లక్షల రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
CM Revanth Reddy: నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. పార్టీ కార్యక్రమాలపై చర్చ..
తాజావార్తలు
-
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
-
Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
-
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?