Ekadasi 2024: ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. తొలి ఏకాదశి సందర్భంగా సందడి..
- రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ..
- తొలి ఏకాదశి- మొహరం ఒకే రోజు రావడంతో పూజలు- ప్రార్థనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ekadasi 2024: రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. తొలి ఏకాదశి, మొహరం ఒకే రోజు కావడంతో భక్తులు పూజలు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే ఆలయాల వద్ద క్యూలు కట్టారు. యాదగిరిగుట్ట, బాసర, శ్రీశైలం, వేములవాడ, భద్రాచలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొందరు ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలు చేస్తున్నారని తెలిపారు. వర్షం కారణంగా కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
Read also: Viral Photo: ఒకే ఫ్రేమ్లో మూడు ఇండస్ట్రీల స్టార్ హీరోలు.. ఫొటో వైరల్!
Also Read
- Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. ఆలయ అర్చకులు శ్రీ స్వామివారికి మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు, పరివార దేవతార్చనలు నిర్వహించి కల్యాణ మండపంలో 24 గంటల పాటు అఖండ భజన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, అధికారులు కాలినడకన గోదావరి నదిలో త్రివేణి సంగమం వద్దకు చేరుకుని కుండలలో గోదావరి జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజాము నుంచే వర్షంలోనే కాళేశ్వరం చేరుకుని పవిత్ర త్రివేణి సంగమం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శుభానంద దేవి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
Read also: Islamic Calendar: ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నుంచి కొత్త సంవత్సరం..
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భారీ వర్షాల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న శ్రీవారిని 87 వేల మందికి పైగా దర్శించుకున్నారు. 4 కోట్ల 53 లక్షల రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
CM Revanth Reddy: నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. పార్టీ కార్యక్రమాలపై చర్చ..
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!