Islamic Calendar: ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నుంచి కొత్త సంవత్సరం..
- ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నెల మొదటి నెలగా ప్రారంభం..
- చంద్రుని దర్శనం తర్వాత పండుగ తేదీలు నిర్ణయిస్తారు..
- మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటాన్ని 'మొహరం' ..
- ఈ క్యాలెండర్ను అరబ్బులు పురాతన కాలంలో ఉపయోగించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Islamic Calendar: మొహర్రం నెల ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెలగా ప్రారంభం అవుతుంది.. చంద్రుని దర్శనం తర్వాత ఈ పండుగ తేదీలు నిర్ణయిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు మొహర్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పదవ రోజును అశురా దినంగా పాటిస్తారు. (చాంద్రమానం ప్రకారం 2024 జూలై 17న) మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రమైన రోజున పీర్ల (పంజా)ని ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అల్లా ఆరాధన సమయంలో బెల్లంతో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు. ‘మొహర్రం’ అంటే పండుగ రోజు కాదు. ఈ రోజు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటుంది. 14 శతాబ్దాల క్రితం ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటాన్ని ‘మొహరం’ అంటారు. అరబ్బులు పురాతన కాలంలో ఈ క్యాలెండర్ను ఉపయోగించారు.
Read also: CM Revanth Reddy: నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. పార్టీ కార్యక్రమాలపై చర్చ..
Also Read
- Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ 'సీక్రెట్స్' పాటించాల్సిందే!
- Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
చరిత్ర..
మహ్మద్ ప్రవక్త మరణానంతరం హజ్రత్ అబూబకర్ సిద్ధిక్, హజ్రత్ అలీ, హజ్రత్ ఉమర్ కూడా అద్భుతమైన పరిపాలన అందించారు. తరువాత, యాజిద్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకుని, క్రూరమైన పరిపాలన సాగించాడు. ఆ సమయంలో హజ్రత్ హుస్సేన్ తన రాక్షసత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడారు. శాంతి కోసం హుస్సేన్ చేసిన ప్రతిపాదనలను యాజిద్ తిరస్కరించాడు.. యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన దాదాపు 70 మంది (షహీద్) అమరులవుతారు. అప్పుడు హజ్రత్ హుస్సేన్ ఆ తెగను శాపం పెడతాడు. వారికి ఎప్పటికీ మోక్షం ప్రసాదించవద్దని అల్లాను వేడుకుంటూ తన ప్రాణాలను విడిచిపెట్టాడు. యుద్ధం ముగిసిన తర్వాత యాజిద్ తెగ ప్రజలు పశ్చాత్తాపపడ్డారు.. అల్లా మేం తప్పు చేశాం.. మహమ్మద్ ప్రవక్త కుటుంబంలోని వ్యక్తులను చిత్రహింసలకు గురిచేసి చంపేశాం. మమ్మల్ని క్షమించండి అంటూ గుండెల మీద బాదుకుంటూ హల్చిద.. హల్చిద అని రక్తాలు చిందిస్తూ.. భభ మండే నిప్పులపై కాలికి పాదరక్షలు లేకుండా నిప్పు మీద నడుస్తారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం మొదలైంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
Rajanna Sircilla: వారందరికి ఈనెల 27న రిలీవ్.. రాజన్న ఆలయ ఈవో కీలక ప్రకటన..
తాజావార్తలు
-
Back-to-Back Surprises : ఎన్టీఆర్ – చరణ్ సమ్మర్ హీట్ పెంచేశారుగా
-
Shreyas Iyer Captaincy: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. మ్యాచ్ మొత్తం తప్పిదాలే?
-
JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
RJ Balaji: చరణ్తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?