VRO: వీఆర్వోల నియామక ప్రక్రియ షురూ.. పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు..
- వీఆర్వోలు గ్రామాలకు తిరిగి రానున్నారు..
- మళ్లీ వీఆర్వో విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VRO: భూభారతి చట్టం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో వీఆర్వోలు గ్రామాలకు తిరిగి రానున్నారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన భూభారతి బిల్లుల్లో గ్రామస్థాయిలో కొత్త రెవెన్యూ అధికారులను నియమిస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మళ్లీ వీఆర్వో విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామాల్లో పని చేసేందుకు రెవెన్యూ అధికారులను నియమించే ప్రక్రియను ప్రారంభించింది. సర్వేయర్ల నియామకంపైనా దృష్టి సారించింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసి ఇతర విభాగాలకు బదిలీ అయిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని 10,954 రెవెన్యూ గ్రామాలకు నియమించనున్నారు. అలాగే సర్వేయర్లుగా పనిచేసేందుకు అవకాశం కల్పించారు.
Read also: High Court: హైకోర్టులో కేసీఆర్, హరీశ్రావుకు బిగ్ రిలీఫ్..
Also Read
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
- Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
- Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
- CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
గూగుల్ ఫారమ్లలో వివరాలను నింపాలని, జిల్లాల వారీగా కలెక్టర్లు వివరాలను సేకరించాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ శాఖకు తిరిగి వెళ్లాలనుకునే వారందరికీ ఆప్షన్లు ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఈ ఫారం ద్వారా పూర్తి వివరాలను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో గ్రామస్థాయి అధికారులతో పాటు సర్వేయర్గా కూడా పనిచేసేందుకు అవకాశం కల్పించారు. గతంలో ఉన్న వీఆర్వోల పూర్తి వివరాలను ఆప్షన్ల ద్వారా సేకరిస్తున్నారు. మీరు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారు? ఏ విభాగంలో? ఉద్యోగి ఐడీ? ప్రస్తుత పోస్ట్లో నియామకం తేదీ? రెవెన్యూ శాఖలో చేరిన తేదీ? విద్యార్హతలు, ఏ జిల్లా? మీరు ఏ జిల్లాలో పని చేయాలనుకుంటున్నారు? ఇలాంటి వివరాలు ఉన్నాయి.
Read also: JPC First Meeting: జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ తొలి సమావేశం..
సర్వేయర్గా పనిచేయాలంటే తప్పనిసరిగా డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ (ఎంపీసీ) పూర్తి చేసి ఉండాలనే షరతు విధించారు. ఈ నెల 28లోగా వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) హర్షం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, కార్యదర్శి వి.భిక్షం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త అధికారుల రాకతో రెవెన్యూ వ్యవస్థ పటిష్టం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Allu Arjun Silent: విచారణలో వీడియోలు.. నోరు మెదపని అల్లు అర్జున్..
తాజావార్తలు
-
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
-
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
-
Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!