Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
- 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
- లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు
- రూ.15 కోట్ల అక్రమ సొమ్ము ఆరోపణలు
- వైద్య పరీక్షల తర్వాత జైలుకు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. మద్యం రవాణా అక్రమాల వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు, హైదరాబాద్లోని ఈడీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కారుమూరికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈడీ అధికారులు ఆయనను వైద్య పరీక్షల అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు.
అసలు కేసు ఏంటి? సిట్ నమోదు చేసిన ఫిర్యాదులు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానాన్ని అడ్డుపెట్టుకుని భారీ కుంభకోణానికి తెరలేపారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు పలు కీలక అంశాలను గుర్తించారు. మద్యం ధరలను నిబంధనలకు విరుద్ధంగా పెంచడం, భారీగా మామూళ్లు చెల్లించిన కంపెనీలకే విక్రయ అవకాశాలు కల్పించడం, అలాగే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి వైన్ షాపులకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టులలో కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు నిర్ధారించారు. ఈ అక్రమాలపై సిట్ రెండు కేసులు నమోదు చేయగా, నిధుల మళ్లింపు (మనీ లాండరింగ్) కోణంలో ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది.
Also Read
సోదాలు, నిధుల మళ్లింపు.. లగ్జరీ వస్తువులు స్వాధీనం
ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మాజీ మంత్రి కొడుకు కారుమూరి సునీల్కుమార్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు రాజ్ కెసిరెడ్డి, విజయ నరసింహారెడ్డి, సందీప్ల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మద్యం రవాణాకు సంబంధించిన జాయింట్ వెంచర్ అక్రమ ఒప్పందం కాపీలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రెండు ఖరీదైన ‘రోలెక్స్’ వాచీలు, ఒక ‘రేంజ్ రోవర్’ లగ్జరీ కారును ఈడీ సీజ్ చేసింది. దర్యాప్తు క్రమంలోనే ఈ కుంభకోణంలో కారుమూరి నాగేశ్వరరావుకు రూ.15 కోట్ల మేర అక్రమ సొమ్ము ముట్టినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా లెక్క తేల్చారు.
అరెస్టుల పరంపర.. ఆదివారం నాటకీయ పరిణామాలు
ఈ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. జూన్ 11న వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డిలను అరెస్ట్ చేయగా, జూన్ 18న మాజీ మంత్రి తనయుడు కారుమూరి సునీల్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జూన్ 23 ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ బృందం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసింది. సోమవారం ఉదయం ఆయనకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఈడీ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ ఖరారు చేయడంతో ఆయనను నేరుగా చంచల్గూడ జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!