Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
- 18 కంపెనీలకు 121 బ్రాండ్లకు అనుమతి
- ఫారిన్ బీర్లు, సింగిల్ మాల్ట్స్కు గ్రీన్ సిగ్నల్
- సెప్టెంబర్ 1 వరకు అభ్యంతరాలకు అవకాశం
- కొత్త బ్రాండ్లతో పాటు ధరల పెంపు చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Liquor : రాష్ట్రంలోని మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. త్వరలోనే అంతర్జాతీయ ప్రీమియం మద్యం బ్రాండ్లతో పాటు విదేశీ బీర్లు, లగ్జరీ లిక్కర్ రకాలు తెలంగాణ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ప్రధానంగా లోకల్, దేశీయ బ్రాండ్లకే పరిమితమైన తెలంగాణ మద్యం మార్కెట్లోకి గ్లోబల్ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
18 కంపెనీలు.. 121 కొత్త బ్రాండ్లకు అనుమతి
విదేశీ మద్యం ప్రియుల అభిరుచులకు అనుగుణంగా ఇంటర్నేషనల్ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSBCL) చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 18 ప్రముఖ కంపెనీలకు చెందిన 121 మద్యం బ్రాండ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి పబ్లిక్ నోటీస్ జారీ చేసిన ప్రభుత్వం, సెప్టెంబర్ 1 నాటికి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరింది. నూతనంగా రానున్న బ్రాండ్లలో అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ ఉన్న సింగిల్ మాల్ట్ విస్కీలు, హెండ్రిక్స్ జిన్, మంకీ షోల్డర్, టైగర్ లాగర్ బీర్లతో పాటు కొరియన్, జర్మన్ బ్రాండ్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు దేశీయ ప్రీమియం కేటగిరీకి చెందిన ఆర్థోస్ కలెక్టివ్ మాల్ట్ విస్కీ, శంకర్ డిస్టిలర్స్ వర్చాస్ అమెరికన్ విస్కీ, స్మోక్ ల్యాబ్ వోడ్కా, రీకో, వల్లోన్ వంటి బ్రాండ్లు కూడా త్వరలోనే షాపులు, పబ్బుల్లో లభించనున్నాయి.
Also Read
- Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
- Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
- CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
- Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత.. కానీ..!
మరోవైపు కిక్కు దింపే వార్త.. పెరగనున్న మద్యం ధరలు?
ఒకవైపు కొత్త బ్రాండ్లు వస్తున్నాయన్న ఆనందం ఉన్నప్పటికీ, మరోవైపు మద్యం ప్రియుల జేబులకు చిల్లు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. మద్యం తయారీ వెచ్చించే ఖర్చులు, అంతర్జాతీయంగా పెరిగిన ముడిసరుకుల ధరల దృష్ట్యా ధరలు పెంచాలని డిస్టిలరీలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ మద్యం తయారీ కంపెనీల ప్రతిపాదనలను పరిశీలించి, ధరల పెంపుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక దఫా ధరలు పెంచిన నేపథ్యంలో, మళ్ళీ పెంచితే వినియోగదారుల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎలా అధిగమించాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయినప్పటికీ, కంపెనీల ఒత్తిడి మేరకు రానున్న రోజుల్లో మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
-
YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!