Group-1 Exam: గ్రూప్-1 పరీక్షపై హైకోర్టులో పిటిషన్.. అభ్యర్థుల పట్ల వివక్ష లేదన్న టీజీపీఎస్సీ
- గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ..
- తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదు..
- ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులే హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు: టీజీపీఎస్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-1 Exam: గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించినట్లు చెప్పారు. కోఠిలోని ఓ కేంద్రంలో పరీక్ష రాసిన వారే ఎక్కువ మంది ఎంపికయ్యారనేది అవాస్తవం.. అక్కడ ఉన్న రెండు పరీక్ష కేంద్రాలలో 1500 మంది అభ్యర్థులు మెయిన్స్ రాశారు.. మిగతా పరీక్షా కేంద్రాల్లో రాసిన వాళ్లలో అంతకంటే ఎక్కువ మందే ఎంపికయ్యారు అని పేర్కొన్నారు. కోఠిలోని రెండు కేంద్రాలు కేవలం మహిళలకు కేటాయించడంతో సౌకర్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాం అన్నారు. ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు ఏవేవో అనుమానాలతో పిటిషన్లు దాఖలు చేశారు.. వారు చేస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు కేవలం అపోహలు మాత్రమే ఉన్నాయని టీజీపీఎస్సీ తరపు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి తెలిపారు.
Read Also: Gender Change: పెళ్లి కోసం లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి.. చివరకు అత్యాచారం కేసు..
Also Read
అయితే, గ్రూప్-1 పరీక్షకు ఎంపికైన తెలుగు మీడియం అభ్యర్థులు 9.95 శాతం, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు 89.88 శాతం, ఉర్దూ మీడియం 0.1 శాతంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి. ఏపీలో రెండేళ్ల క్రితం నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు.. టీజీపీఎస్సీకి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదు అని తేల్చి చెప్పారు. అందరికీ ఎక్ప్ పర్ట్ ఎంపిక చేసిన అంశాల ఆధారంగా మార్కులు వేశారని వెల్లడించారు. కాగా, ఇవాళ ప్రభుత్వం తరపున వాదనలు ముగిశాయి. తదుపరి పిటిషనర్స్ తరపున వాదనలు సోమవారం రోజున పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తీర్పును వాయిదా వేసింది హైకోర్టు.
తాజావార్తలు
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
-
Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!