Harish Rao: ఎన్నికలు రాక తప్పదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదు..
- కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదు..
- ఏడు నెలల్లో తెలంగాణలో పల్లెలన్ని మురికి కూపాలుగా మారాయి..
- గ్రామపంచాయితీలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ఎన్నికలు రాక తప్పదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాకలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుకు సన్మాన కార్యక్రమంలో హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదన్నారు. ఏడు నెలల్లో తెలంగాణలో పల్లెలన్ని మురికి కూపాలుగా మారాయన్నారు. గ్రామ పంచాయితీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పాలన గాలికొదిలేసి ప్రతిపక్షాల మీద కుట్రలు చేసి ప్రతికారం తీర్చుకోవడానికి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Khammam: సత్తుపల్లి వన మహోత్సవ కార్యక్రమం.. పాల్గొన్న మంత్రులు..
Also Read
- Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు వేలు పెన్షన్ ఇస్తుంటే ఇక్కడి సీఎంకి రెండు వేలు ఇవ్వడం కూడా చేత కావడం లేదని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీకి దుబ్బాకలో అత్యధిక మెజార్టీ వచ్చిందన్నారు. ఖమ్మం జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. సీఎం సొంత జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగాడని ఇప్పుడే తెలిసిందని మండిపడ్డారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి గెలుపోటములు కామన్ అన్నారు. కాలం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది.. ఎన్నికలు రాక తప్పదు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదని తెలిపారు.
Read also: 35 Chinna Katha Kadhu: ఇదో మా సిన్న కుటుంబం తొలి సూపు అంటూన్న నివేదా థామస్..
ఇక మరోవైపు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని ట్విటర్ వేదికగా ఖండించారు. ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.? అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలన.? అన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్నిప్రశ్నించలేని పరిస్థితి అని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తామన్నారు.
Real Estate: యవతిపై ఇద్దరు రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ల అత్యాచార యత్నం..
తాజావార్తలు
-
Gujarat Titans Players: నదులు, గుట్టల మధ్య గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. చిల్ మోడ్లో సిరాజ్ భాయ్.!
-
Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా పతనమైన వెండి రేట్
-
Neel – Mahesh : ఊహించని కాంబో.. నిజమైతే మాత్రం..?
-
Tollywood : ఎగ్జిబిటర్స్ vs గిల్డ్ నిర్మాతల వివాదం.. నేడు పవర్ స్టార్ తో గిల్డ్ నిర్మాతలు కీలక సమావేశం
-
Trump-Pakistan: పాకిస్థాన్కు ఊహించని సిట్యుయేషన్.. ట్రంప్ ప్రతిపాదనకు ‘నో’ చెప్పిన పాక్..
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!