Rythu Runa Mafi: నేడు రెండో విడత రైతు రుణమాఫీ.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిధులు జమ..
- నేడు రెండో విడత రైతు రుణమాఫీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం..
- మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిధులు జమ..
- అసెంబ్లీలో చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం..
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతువేదికల్లో ప్రత్యక్ష ప్రసారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Runa Mafi: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో విడత రుణమాఫీ పై అప్డేట్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సభా ప్రాంగణంలోనే కార్యక్రమం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతువేదికలలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అదే సమయంలో వివిధ జిల్లాల కలెక్టరేట్లలో జిల్లా కలెక్టర్ల ద్వారా రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. లక్షన్నర లోపు బకాయి ఉన్న దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.6,500 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. ఈ నెలాఖరులోగా లక్షన్నర కేటగిరీ రైతుల రుణాలను మాఫీ చేస్తామని తాజాగా ప్రకటించింది. ఇందుకోసం అవసరమైన నిధుల సమీకరణ చేపట్టారు.
Read also: Astrology: జులై 30, మంగవారం దినఫలాలు
Also Read
ఈ నెల 15న జీవో నెంబర్ 567 జారీ కాకముందే రూ.10 వేల కోట్లు సర్దుబాటు చేసి.. మొదటి విడతలో 11.50 లక్షల మంది రైతులకు రూ.6,099 కోట్లు విడుదల చేశారు. మిగిలిన నిధులతో పాటు ఈ నెల 23న రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ.3 వేల కోట్లు అప్పు తీసుకుంది. ఫలితంగా రూ. 7 వేల కోట్లు ఖజానాకు గండి పడింది. ఈ నిధులు రెండో విడతకే సరిపోవన్న ఉద్దేశంతో మంగళవారం పంపిణీకి శ్రీకారం చుట్టారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డేటా ప్రాసెసింగ్ సమాచారం ప్రకారం… లక్ష నుంచి లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతులు దాదాపు 7 లక్షల మంది ఉన్నారు. వీరికి రూ.6,500 కోట్లు సరిపోతాయని అంచనా. 6,500 కోట్లకు సంబంధించిన బిల్లులు సోమవారం సాయంత్రం ట్రెజరీకి చేరాయి. వ్యవసాయ శాఖ ప్రొసీడింగ్స్ కూడా జారీ చేసింది. రైతుల వివరాలు, వారి ఖాతాలు, జమ చేసిన నిధులను ట్రెజరీకి అందజేశారు. మరోవైపు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రుణమాఫీ లబ్ధిదారులు, రైతులు, పార్టీ కార్యకర్తలతో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాల ఉదయం రెండో విడతలో అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయశాఖ ప్రకటించనుంది.
Read also: Rahul Gandhi: “రాజ్యాంగానికి అతీతుడివి కాదు”.. రాహుల్ తీరుపై కేంద్రమంత్రుల ఆగ్రహం..
రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 11.50 లక్షల మంది రైతులకు రూ. 6,099 కోట్లు విడుదల చేయగా… 11.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,014 కోట్లు జమయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల 17,877 ఖాతాలకు చెందిన రూ.84.94 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఆర్బీఐ సూచించిన వివరాల ప్రకారం సాంకేతిక లోపాలను సరిచేసి… ఆర్బీఐ నుంచి నిధులు రాగానే తిరిగి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య బ్యాంకులకు అనుసంధానమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (సీడెడ్ సొసైటీలు)కు సంబంధించిన రైతుల రుణ ఖాతాలపై తనిఖీలు పూర్తయ్యాయి. ఈ నిధులు కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. మంగళవారం తర్వాత రెండు విడతల్లో రుణమాఫీ కింద 18.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,600 కోట్లు జమకానున్నాయి. మూడో విడతలో ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను ఆగస్టు నెలలో మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కల్వకుర్తి సభలో ప్రకటించారు. మూడో దశలో రైతుల సంఖ్య, రెండో దశ కంటే రెట్టింపు నిధులు వచ్చే అవకాశం ఉంది.
Gottipati Ravi Kumar: ఇచ్చిన మాటలను ప్రభుత్వం నిలబెట్టుకుంది.. రాజముద్ర పునరుద్ధరణపై మంత్రి హర్షం
తాజావార్తలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!