Rahul Gandhi: “రాజ్యాంగానికి అతీతుడివి కాదు”.. రాహుల్ తీరుపై కేంద్రమంత్రుల ఆగ్రహం..
- లోక్సభలో రాహుల్ గాంధీ తీరుపై కేంద్రమంత్రుల ఆగ్రహం..
- రాజ్యాంగ నియమాలను పట్టించుకోవడం లేదని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అశ్విణి వైష్ణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రిసైడింగ్ అధికారిపై ప్రశ్నలు సంధించడంపై పార్లమెంట్లో పాల్గొనే సమయం రాజ్యాంగ నిబంధనల్ని అనుసరించే ఉద్దేశ్యం ఆయనకు లేదని అన్నారు. సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధికారాన్ని ప్రశ్నించడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Borewell Incident: బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలిక.. పుట్టిన రోజు వేడుకలకు ముందే ఘటన..
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
స్పీకర్పై ప్రతిపక్ష నేత వ్యాఖ్యలు సభా నియమాలను, విధానాలను పట్టించుకోకుండా మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రవర్తనకు ఒక చరిత్ర ఉందని మరో మంత్రి అశ్విణి వైష్ణవ్ అన్నారు. ఒకప్పుడు రాహుల్ గాంధీ సొంత పార్టీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ని చింపేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయనకు రాజ్యాంగ నిబంధనల్ని అనుసరించే ఉద్దేశ్యం లేదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ సభలో ఆయన ప్రవర్తన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నేత పదవి పెద్ద బాధ్యత అని, అయితే స్పీకర్ని ఉద్దేశించి గాంధీ సభలో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని రిజిజు అన్నారు. సభ నిబంధనల ప్రకారం నడుస్తుందని, స్పీకర్ సభకు సంరక్షకుడని, ఈరోజు రాహుల్ గాంధీ స్పీకర్పై దాడి చేయడం ప్రారంభించారని, చర్చలో ఉన్న కేంద్ర బడ్జెట్ తప్పా మిగతా వాటి గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నిబంధనలకు లోబడి మాట్లాడాలని కాంగ్రెస్ నాయకుడికి పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా లేనప్పుడు వేరే విషయం కానీ, ఇప్పుడు ఆ హోదాలో ఉండీ అతను నిబంధనల్ని పాటించాల్సిన అవసరం ఉంటుందని, రాజ్యాంగానికి ఎవరూ అతీతుల కాదని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..