Rahul Gandhi: “రాజ్యాంగానికి అతీతుడివి కాదు”.. రాహుల్ తీరుపై కేంద్రమంత్రుల ఆగ్రహం..
- లోక్సభలో రాహుల్ గాంధీ తీరుపై కేంద్రమంత్రుల ఆగ్రహం..
- రాజ్యాంగ నియమాలను పట్టించుకోవడం లేదని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అశ్విణి వైష్ణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రిసైడింగ్ అధికారిపై ప్రశ్నలు సంధించడంపై పార్లమెంట్లో పాల్గొనే సమయం రాజ్యాంగ నిబంధనల్ని అనుసరించే ఉద్దేశ్యం ఆయనకు లేదని అన్నారు. సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధికారాన్ని ప్రశ్నించడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Borewell Incident: బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలిక.. పుట్టిన రోజు వేడుకలకు ముందే ఘటన..
Also Read
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
స్పీకర్పై ప్రతిపక్ష నేత వ్యాఖ్యలు సభా నియమాలను, విధానాలను పట్టించుకోకుండా మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రవర్తనకు ఒక చరిత్ర ఉందని మరో మంత్రి అశ్విణి వైష్ణవ్ అన్నారు. ఒకప్పుడు రాహుల్ గాంధీ సొంత పార్టీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ని చింపేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయనకు రాజ్యాంగ నిబంధనల్ని అనుసరించే ఉద్దేశ్యం లేదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ సభలో ఆయన ప్రవర్తన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నేత పదవి పెద్ద బాధ్యత అని, అయితే స్పీకర్ని ఉద్దేశించి గాంధీ సభలో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని రిజిజు అన్నారు. సభ నిబంధనల ప్రకారం నడుస్తుందని, స్పీకర్ సభకు సంరక్షకుడని, ఈరోజు రాహుల్ గాంధీ స్పీకర్పై దాడి చేయడం ప్రారంభించారని, చర్చలో ఉన్న కేంద్ర బడ్జెట్ తప్పా మిగతా వాటి గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నిబంధనలకు లోబడి మాట్లాడాలని కాంగ్రెస్ నాయకుడికి పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా లేనప్పుడు వేరే విషయం కానీ, ఇప్పుడు ఆ హోదాలో ఉండీ అతను నిబంధనల్ని పాటించాల్సిన అవసరం ఉంటుందని, రాజ్యాంగానికి ఎవరూ అతీతుల కాదని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!