Rahul Gandhi: “రాజ్యాంగానికి అతీతుడివి కాదు”.. రాహుల్ తీరుపై కేంద్రమంత్రుల ఆగ్రహం..
- లోక్సభలో రాహుల్ గాంధీ తీరుపై కేంద్రమంత్రుల ఆగ్రహం..
- రాజ్యాంగ నియమాలను పట్టించుకోవడం లేదని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అశ్విణి వైష్ణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రిసైడింగ్ అధికారిపై ప్రశ్నలు సంధించడంపై పార్లమెంట్లో పాల్గొనే సమయం రాజ్యాంగ నిబంధనల్ని అనుసరించే ఉద్దేశ్యం ఆయనకు లేదని అన్నారు. సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధికారాన్ని ప్రశ్నించడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Borewell Incident: బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలిక.. పుట్టిన రోజు వేడుకలకు ముందే ఘటన..
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
స్పీకర్పై ప్రతిపక్ష నేత వ్యాఖ్యలు సభా నియమాలను, విధానాలను పట్టించుకోకుండా మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రవర్తనకు ఒక చరిత్ర ఉందని మరో మంత్రి అశ్విణి వైష్ణవ్ అన్నారు. ఒకప్పుడు రాహుల్ గాంధీ సొంత పార్టీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ని చింపేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయనకు రాజ్యాంగ నిబంధనల్ని అనుసరించే ఉద్దేశ్యం లేదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ సభలో ఆయన ప్రవర్తన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నేత పదవి పెద్ద బాధ్యత అని, అయితే స్పీకర్ని ఉద్దేశించి గాంధీ సభలో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని రిజిజు అన్నారు. సభ నిబంధనల ప్రకారం నడుస్తుందని, స్పీకర్ సభకు సంరక్షకుడని, ఈరోజు రాహుల్ గాంధీ స్పీకర్పై దాడి చేయడం ప్రారంభించారని, చర్చలో ఉన్న కేంద్ర బడ్జెట్ తప్పా మిగతా వాటి గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నిబంధనలకు లోబడి మాట్లాడాలని కాంగ్రెస్ నాయకుడికి పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా లేనప్పుడు వేరే విషయం కానీ, ఇప్పుడు ఆ హోదాలో ఉండీ అతను నిబంధనల్ని పాటించాల్సిన అవసరం ఉంటుందని, రాజ్యాంగానికి ఎవరూ అతీతుల కాదని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!