Hyderabad Metro: మెట్రోలో ప్రయాణికుల రద్దీ.. ప్రయాణికులతో నిండిపోయిన స్టేషన్లు..
- భారీ వర్షానికి మెట్రో లో పెరిగిన ప్రయాణికుల రద్దీ..
- పెరిగిన రద్దీతో కిక్కిరిసిపోతున్న మెట్రో రైళ్లు..
- కిక్కిరిసిన జనంతో పక్కకు కదలలేని స్థితిలో ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రోకి ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. దీంతో మోట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. దీంతో ప్రయాణికులు పక్కకు కదలలేని స్థితిలో ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. రద్దీ కారణంగా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మహిళా కొచ్ లో ఒకరితో ఒకరు మహిళా ప్రయాణికులు గొడవకు దిగుతున్నారు. రోజు వారీ ప్రయాణికుల కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణం చేయడంతో నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులతో కిక్కిరిపోయింది. టికెట్ కోసం క్యూ లైన్లలో బారులు తీరారు.
Read also: RTC Rakhi Record: ఆర్టీసీ రాఖీ రికార్డ్.. ఒక్క రోజే 64 లక్షల మంది ప్రయాణం..
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
సాధారణంగా హైదరాబాద్ మెట్రో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక ఇలా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో.. రోడ్డుపై ప్రయాణించడం నరకాన్ని తలపిస్తుంది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవడం కంటే మెట్రో రైలులో వెళ్లడమే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది మంచి నిర్ణయమే కానీ మెట్రో రైళ్లు సరిపోని పరిస్థితి నెలకొంది. సాధారణంగా హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రతి 5 నిమిషాలకు వస్తాయి. రద్దీ పెరిగినప్పుడు, 2 రైళ్ల తర్వాత, 3వ రైలును 3 నిమిషాల్లో విడుదల చేస్తారు. ట్రాఫిక్ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. సో..రాన్రానూ మెట్రో ప్రయాణం బాగా పెరిగింది. దీంతో రైళ్లు ముందుగానే వస్తున్నా సరిపోవడం లేదు. ఒక్కో రైలు వస్తే ప్లాట్ఫారమ్ దగ్గర 2 రైళ్లకు సరిపడా మంది ఉంటారు.
Read also: Historical Temple: ఆ ఆలయం రాత్రిపూట నగ్నంగా నిర్మాణం.. కానీ వారికి మాత్రం నో ఎంట్రీ..
చాలా సందర్భాల్లో హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఎక్కువసేపు రైళ్లను నడుపుతోంది. ఈరోజు ఉదయం భారీ వర్షం కురియడంతో మెట్రో రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. నేడు చాలా మంది రైళ్లను ఎంచుకుంటున్నారు. కొందరు బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. మెట్రో టైమింగ్స్ పెంచాలని.. ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు వచ్చేలా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే సాంకేతిక కారణాలతో మెట్రో యాజమాన్యం ప్రతి 5 నిమిషాలకు ఒక రైలును పంపుతోంది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. 5 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. మెట్రో రైళ్ల సంఖ్యను పెంచితే ప్రయాణికులకు మేలు జరుగుతుంది.
School Holiday: విద్యాశాఖ అలర్ట్.. నేడు పాఠశాలలకు సెలవు
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!