Hyderabad Metro: మెట్రోలో ప్రయాణికుల రద్దీ.. ప్రయాణికులతో నిండిపోయిన స్టేషన్లు..
- భారీ వర్షానికి మెట్రో లో పెరిగిన ప్రయాణికుల రద్దీ..
- పెరిగిన రద్దీతో కిక్కిరిసిపోతున్న మెట్రో రైళ్లు..
- కిక్కిరిసిన జనంతో పక్కకు కదలలేని స్థితిలో ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రోకి ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. దీంతో మోట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. దీంతో ప్రయాణికులు పక్కకు కదలలేని స్థితిలో ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. రద్దీ కారణంగా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మహిళా కొచ్ లో ఒకరితో ఒకరు మహిళా ప్రయాణికులు గొడవకు దిగుతున్నారు. రోజు వారీ ప్రయాణికుల కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణం చేయడంతో నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులతో కిక్కిరిపోయింది. టికెట్ కోసం క్యూ లైన్లలో బారులు తీరారు.
Read also: RTC Rakhi Record: ఆర్టీసీ రాఖీ రికార్డ్.. ఒక్క రోజే 64 లక్షల మంది ప్రయాణం..
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
సాధారణంగా హైదరాబాద్ మెట్రో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక ఇలా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో.. రోడ్డుపై ప్రయాణించడం నరకాన్ని తలపిస్తుంది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవడం కంటే మెట్రో రైలులో వెళ్లడమే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది మంచి నిర్ణయమే కానీ మెట్రో రైళ్లు సరిపోని పరిస్థితి నెలకొంది. సాధారణంగా హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రతి 5 నిమిషాలకు వస్తాయి. రద్దీ పెరిగినప్పుడు, 2 రైళ్ల తర్వాత, 3వ రైలును 3 నిమిషాల్లో విడుదల చేస్తారు. ట్రాఫిక్ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. సో..రాన్రానూ మెట్రో ప్రయాణం బాగా పెరిగింది. దీంతో రైళ్లు ముందుగానే వస్తున్నా సరిపోవడం లేదు. ఒక్కో రైలు వస్తే ప్లాట్ఫారమ్ దగ్గర 2 రైళ్లకు సరిపడా మంది ఉంటారు.
Read also: Historical Temple: ఆ ఆలయం రాత్రిపూట నగ్నంగా నిర్మాణం.. కానీ వారికి మాత్రం నో ఎంట్రీ..
చాలా సందర్భాల్లో హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఎక్కువసేపు రైళ్లను నడుపుతోంది. ఈరోజు ఉదయం భారీ వర్షం కురియడంతో మెట్రో రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. నేడు చాలా మంది రైళ్లను ఎంచుకుంటున్నారు. కొందరు బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. మెట్రో టైమింగ్స్ పెంచాలని.. ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు వచ్చేలా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే సాంకేతిక కారణాలతో మెట్రో యాజమాన్యం ప్రతి 5 నిమిషాలకు ఒక రైలును పంపుతోంది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. 5 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. మెట్రో రైళ్ల సంఖ్యను పెంచితే ప్రయాణికులకు మేలు జరుగుతుంది.
School Holiday: విద్యాశాఖ అలర్ట్.. నేడు పాఠశాలలకు సెలవు
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!