RTC Rakhi Record: ఆర్టీసీ రాఖీ రికార్డ్.. ఒక్క రోజే 64 లక్షల మంది ప్రయాణం..
- రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో ప్రయాణికులు..
- ఆర్టీసీ బస్సుల్లో ఒక్కరోజే 63.86 లక్షల మంది రాకపోకలు..
- మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్న 41.74 లక్షల మహిళామణులు..
- ఒక్కరోజే మహిళలకు 17 కోట్ల ఆదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Rakhi Record: రాఖీ పౌర్ణమి నాడు ఆర్టీసీ బస్సుల్లో రికార్డు స్థాయిలో జనం ప్రయాణించారు. రోజుకు 63.86 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా.. ఇందులో 41.74 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారు. ఒక్కరోజులో మహిళలకు 17 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది, అధికారులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా 63.86 లక్షల మందిని టీజీఎస్ఆర్టీసీ తమ గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సృష్టించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు మహాలక్ష్మి-మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని 41.74 లక్షల మంది మహిళలు వినియోగించుకున్నట్లు వెల్లడైంది. 21.12 లక్షల మంది నగదు చెల్లించి బస్సుల్లో ప్రయాణించారని పేర్కొన్నారు.
Read also: Historical Temple: ఆ ఆలయం రాత్రిపూట నగ్నంగా నిర్మాణం.. కానీ వారికి మాత్రం నో ఎంట్రీ..
Also Read
- Drugs Party : మాదాపూర్లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీపై దాడి.. బెజవాడ కనెక్షన్ బట్టబయలు
- CM Revanth Reddy :ఇక ప్రభుత్వ స్కూల్ పిల్లలూ కార్పొరేట్ స్టైల్లో.. కొత్త కిట్లు రెడీ.!
- MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్
- Bhatti Vikramarka : చరిత్రను, భవిష్యత్తును గుండెకు హత్తుకున్న నగరం హైదరాబాద్
రాఖీ రోజున ఆర్టీసీకి రికార్డు స్థాయిలో 32 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 17 కోట్లు మహాలక్ష్మి పథకం ద్వారా అందగా రూ. నగదు చెల్లింపు టిక్కెట్ల ద్వారా 15 కోట్లు. భారీ వర్షంలోనూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకున్న ఆర్టీసీ సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసీ తన పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుని పగలు, రాత్రి నిరంతరం పనిచేసిన ఉద్యోగుల సేవలను కొనియాడారు. ఉన్నతాధికారులు కొన్నిసార్లు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ రద్దీ రూట్లలో అదనపు బస్సులను నడిపి ప్రయాణికులను తరలించడంలో సఫలమవుతున్నారని చెబుతున్నారు.
Read also: School Holiday: విద్యాశాఖ అలర్ట్.. నేడు పాఠశాలలకు సెలవు
రాఖీ పండుగ వచ్చినా సిబ్బంది నిరంతరం పనిచేశారని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో బస్సుల్లో రాఖీలు కట్టారని వారందరికీ అభినందనలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో పెద్దఎత్తున ప్రయాణించి సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆర్టీసీ విజయవంతంగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
MLC Kavitha: నేడు సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!