Historical Temple: ఆ ఆలయం రాత్రిపూట నగ్నంగా నిర్మాణం.. కానీ వారికి మాత్రం నో ఎంట్రీ..
- ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శివాలయం..
- ఈ ఆలయాన్ని 7-8వ శతాబ్దాలలో కలచూరి పాలకులు నిర్మించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Historical Temple: భారతదేశం దైవశక్తికి, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఇక్కడి దేవాలయాలు కేవలం విశ్వాస కేంద్రాలు మాత్రమే కాదు. వాటిలోని శిల్ప సౌందర్యం యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ఇటువంటి అనేక పురాతన దేవాలయాల వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అటువంటి విశిష్టమైన దేవాలయం ఛత్తీస్గఢ్లోని బలోదాబజార్లో ఉంది. ఈ ఆలయం మహానది ఒడ్డున ఉంది. ఇది పురాతన దేవాలయం. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయంలోకి చెల్లెళ్లు, అన్నలు ప్రవేశించడం నిషేధం. ఛత్తీస్గఢ్లోని బలోదాబజార్లోని కస్డోల్ సమీపంలోని నారాయణపూర్ గ్రామంలోని శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది. సోదరులు, సోదరీమణులు కలిసి ఈ ఆలయాన్ని సందర్శించకూడదు. ఈ ఆలయం గిరిజన ఆచారాలతో ముడిపడి ఉంది. నారాయణ్ అనే ప్రధాన శిల్పి రాత్రిపూట పూర్తిగా నగ్నంగా ఆలయాన్ని నిర్మించేవాడని చెబుతారు. శిల్పి నారాయణ్ కు తన భార్య భోజనం తెచ్చేంది. అయితే ఆలయ శిఖర నిర్మాణానికి సమయం వచ్చినప్పుడు, ఒక వింత సంఘటన జరిగింది. ఒకరోజు నారాయణ్ అతని భార్యకు బదులుగా.. నారాయణ్ చెల్లెలు భోజనం తెచ్చింది.
Read also: Sangeetha: వారు కనీస గౌరవం కూడా ఇవ్వరు.. సంగీత సంచలన వ్యాఖ్యలు!
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
- Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
- Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
అప్పుడు నగ్నంగా పని చేస్తున్న శిల్పి నారాయణ అవమానంగా భావించాడు. దీతో నారాయణ్ గుడి శిఖరంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అన్నా చెల్లెల్లను ఆలయం లోపలికి అనుమంతించరు. ఈ పురాతన ఆలయానికి పూజలు, దర్శనం కోసం సోదరులు, సోదరీమణులు కలిసి వెళ్లరని పురాణాలు చెబుతున్నాయి. అన్నదమ్ములు కలసి వెళ్లకపోవడానికి గోడలపై లింగ శిల్పాలు కూడా కారణం. ఈ శివాలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తవ్వకాల్లో లభించిన విగ్రహాలను ఇందులో భద్రపరిచారు. ఈ ఆలయాన్ని ఆరు నెలల్లో నిర్మించారు. ఈ ఆలయాన్ని 7,8వ శతాబ్దాలలో కలచూరి పాలకులు నిర్మించారు. ఈ ఆలయం ఎరుపు, నలుపు ఇసుకరాయితో నిర్మించబడింది. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయంలో 16 స్తంభాలు ఉండగా, ఒక్కోదానిపై శిల్పాలు తయారు చేయబడ్డాయి. ఆలయం లోపల ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది.
Read also: Neem Infused Water: వేప నీరు తాగితే శరీరంలో ఇన్ని మార్పులా.?
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!