కేంద్రాన్ని బద్నం చేస్తున్నారు : ప్రదీప్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ మంత్రులు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదని మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ మంత్రులు వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకి తీవ్రం అవుతుందని, తెలంగాణ వస్తే ఆంధ్ర ఉద్యోగులు అందరూ వెళ్ళిపోతారు… మన వాళ్లకు ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు. అందుకే యువత ప్రాణాలకు తెగించి పోరాటం చేశారని, అలా తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వక పోవడంతో యువత రాష్ట్ర ప్రభుత్వం పై తిరగబడే పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా మంత్రులు అపాయింట్మెంట్ తీసుకోకుండా ఢిల్లీకి వెళ్లి మంత్రులు కలవడం లేదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఎదో పని మీద ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదని కేంద్రాన్ని బద్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం కి, టీఆర్ఎస్కి దరిద్రం వెంటాడుతోందని, సీఎం వాళ్ల సొంత మంత్రులకే దొరకడు కదా… మూడు మూడు నెలలు ఫార్మ్ హౌస్ లో పడుకుంటారు అంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని, ఆ వైఫల్యాలను కేంద్రం పై మోపే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మాటలు ప్రజలు నమ్మరని ఇక ఆ పార్టీ అధికారంలోకి రాదంటూ ఆయన జోస్యం చెప్పారు.
Also Read
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ఎఫెక్ట్... ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
- CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
- Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!
తాజావార్తలు
-
David Warner: మూడు గ్లాసుల మందు… కుటుంబంతో ప్రయాణం.. స్టార్ క్రికెటర్కు కోర్టు ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్..
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!