Telangana Govt: రిటైర్డ్ ఉద్యోగులపై తెలంగాణ సర్కార్ వేటు.. 6,729 మంది తొలగింపుకి ఆదేశాలు!
- రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం..
- ఒక్క జీవో.. వేల మందికి ఉద్వాసన..
- అటెండర్ నుంచి ఐఏఎస్ ల వరకు వేటు..
- పదవి విరమణ చేసిన కాంట్రాక్ట్ పై పని చేస్తున్న వారిపై వేటు..
- లిస్టులో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సహా ముఖ్య అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే ఆర్డర్ తో దాదాపు 6,729 మంది పైన వేటు పడింది. ప్రభుత్వంలోని పలు శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టుపై పని చేస్తున్న వారిపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో అటెండర్ నుంచి ఐఏఎస్ల వరకు ఉన్నారు. ఈ లిస్టులో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తో సహా వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్రావు, కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్ఎన్ రెడ్డితో పాటు 10 మంది ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మార్చ్ 31వ తేదీలోపు అన్ని శాఖల్లోని రిటైర్డ్ ఉద్యోగులను గుర్తించి తొలగించాలని వెల్లడించారు. అయితే, వీరి ప్లేస్ లో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారు.
Read Also: Surya Grahan In India : రేపే ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. సమయం, వివరాలు ఇవే..
Also Read
కాగా, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్సిపల్ శాఖ పరిధిలోని 177 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరందరిని తక్షణమే తొలగిస్తున్నట్లు అందులో స్పష్టం చేశారు. అయితే, ఈ జాబితాలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెప్మా, కుడా, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైల్, రెరా, వైటీడీఏ.. ఇలా వివిధ విభాగాల్లో పని చేస్తున్న విశ్రాంత ఐఏఎస్ లు, ఆర్డీవోలు, డీఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లతో పాటు పలు క్యాడర్లకు చెందిన అధికారులు సైతం ఉన్నారు. మరోవైపు, విద్యుత్త్ శాఖలో మరికొందరు డైరెక్టర్లను కూడా తొలగించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!