Hyderabad: వాల్టా చట్టానికి అధికారులు పదును.. చెట్టు నరికితే భారీ జరిమానాలు..
- హైదరాబాద్ లో చెట్లను సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఫోకస్ ..
- అధికారులను సంప్రదించకుండా చెట్లను నరికితే భారీ జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ లో చెట్లను సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఫోకస్ పెట్టింది. ప్రతి చెట్టును కాపాడేందుకు వాల్టా చట్టాన్ని కఠినతరం చేస్తోంది. చెట్టును నరికివేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తుంది. పార్కులో మొక్కను తీసివేసిన, ఇంట్లో చెట్టు కొమ్మలను నరికినా జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. కేబీఆర్ నేషనల్ పార్క్కు సంబంధించి ఇటీవల కాలంలో అటవీశాఖ అధికారులు ఇలాంటి ఫిర్యాదులతో పలు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ డివిజన్లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వాల్టా చట్టం ప్రకారం తమ ఇంటి ఆవరణలోని చెట్టును ఎవరూ స్వయంగా నరికివేయకూడదు. ఆ చెట్టు వల్ల ఏదైనా సమస్య ఉంటే అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అధికారులు పరిశీలించి, నిజంగా సమస్య ఉంటే, చెట్టును నరికి లేదా స్థలం నుండి తొలగించి మరెక్కడా నాటుతారు. చెట్టును తొలగించేందుకు రూ. 500, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. లేకపోతే, నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా వేలల్లో ఉంటుంది.
Read also: South Central Railway: తెలంగాణ- కర్ణాటక ఎంపీలతో జిఎం అరుణ్ కుమార్ జైన్ సమావేశం..
Also Read
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
కానీ చాలా మందికి వాల్టా చట్టంపై సరైన అవగాహన లేదు. దీంతో కొందరు తమ ఇళ్లలో చెట్లను నరికివేస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.32లో నివాసముంటున్న సమ్మిరెడ్డి తన ఇంటి ముందున్న మూడు చెట్లను కరెంటు తీగలు అడ్డుగా ఉన్నాయని నరికాడు. అతనికి అధికారులు జరిమానా విధించారు. కానీ అలాంటి చట్టం ఉందని తనకు తెలియదనే చెట్లను నరికివేసినట్లు సమ్మిరెడ్డి అధికారులకు తెలిపారు. మరోవైపు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 76లో నివాసముంటున్న ప్రసాద్ ఇంట్లోని సీతాఫలం చెట్లను నరికినందుకు అటవీశాఖ అధికారులు రూ.12వేలు జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ వ్యాపారి తన ఇంటి ఆవరణోని చెట్టు కొమ్మను నరికేయడంతో రూ.10వేల జరిమానా కట్టాడు. గతేడాది బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్బీటీ నగర్లో నివాసముంటున్న హేమలత ఇంటి పక్కన చెట్టును నరికితే రూ.12 వేలు జరిమానా విధించారు. ఇదిలా ఉండగా.. ఈ చట్టం చెట్లు, మొక్కలకే కాకుండా భూమి, నీటికి కూడా వర్తిస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Telangana Rains: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
తాజావార్తలు
-
Ram Charan : స్టార్ క్రికెటర్ బుమ్రాకు సారీ చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
-
US-Iran agreement: “చివరి దశలో అమెరికా-ఇరాన్ డీల్”.. ట్రంప్ కీలక ప్రకటన
-
RCB: ప్లేఆఫ్స్ ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్ సీజన్ మొత్తానికి దూరం
-
Bangladesh: “షేక్ హసీనా చేసిన తప్పు మళ్లీ చేయొద్దు”.. తారిక్ రెహ్మాన్కు హెచ్చరిక
-
Shreyas Iyer: 146 మ్యాచ్ల తర్వాత శ్రేయస్ తొలి ఐపీఎల్ సెంచరీ.. ఛేజింగ్ చేస్తూ అరుదైన ఘనత
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?